సరోజ్ పాండే

సరోజ్ పాండే భారతీయ జనతా పార్టీ కి చెందిన ఒక రాజకీయవేత్త.

సరోజ్ పాండే భారతీయ జనతా పార్టీ కి చెందిన ఒక రాజకీయవేత్త.

సరోజ్ పాండే
బిజెపి కి జాతీయ ఉపాధ్యక్షురాలు
Assumed office
29 July 2023
అధ్యక్షుడు
రాజ్య సభ సభ్యురాలు
In office
3 April 2018 – 2 April 2024
అంతకు ముందు వారుభూషణ్ లాల్ జంగ్డే
తరువాత వారుదేవేంద్ర ప్రతాప్ సింగ్ (ఛత్తీస్‌గఢ్ రాజకీయ నాయకుడు)
నియోజకవర్గంఛత్తీస్ గఢ్
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
In office
16 August 2014 – 26 September 2020
వ్యక్తిగత వివరాలు
జననం (1968-06-22) 1968 జూన్ 22 (వయసు 55)
భిలాయ్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం
జాతీయతIndian
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
కళాశాలభిలాయ్ మహిళా కళాశాల, పండిట్ రవిశంకర్ విశ్వవిద్యాలయం
M.Sc. (పిల్లల అభివృద్ధి)
వృత్తిరాజకీయవేత్త
వెబ్‌సైట్Official Website

సరోజ్ పాండే (జననం: 22 జూన్, 1968) భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందిన ఒక రాజకీయవేత్త. ఆమె బిజెపికి జాతీయ ఉపాధ్యక్షురాలుగా వ్యవహరించింది. అంతకుముందు, ఆమె భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ సభ్యురాలిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసింది. రాజ్యసభ కు ఎంపీ కావడానికి ముందు, ఆమె దుర్గ్ నుండి 15వ లోక్ సభ కు ఎన్నికయింది. ఛత్తీస్ గఢ్ శాసనసభ సభ్యురాలిగా కూడా ఎన్నికయింది.[1][2]

ప్రారంభ జీవితం మార్చు

1968 జూన్ 22న శ్యామ్జీ పాండే, గులాబ్ దేవి పాండే దంపతులకు సరోజ్ పాండే జన్మించింది. ఆమె రాయ్ పూర్ లోని పం. రవిశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన భిలాయి మహిళా కళాశాలలో, ఎం.ఎస్.సి. (పిల్లల అభివృద్ధి) కోర్సు చేసింది.[3]

రాజకీయ జీవితం మార్చు

సరోజ్ పాండే రెండు సారులు 2000లో, 2005లో తిరిగి రెండవసారి దుర్గ్ కి మేయర్ గా ఎన్నికయింది. ఆమె 2008లో వైశాలి నగర్ కు ఆమె మొదటి శాసనసభ సభ్యురాలు. ఆపై 2009 భారత సార్వత్రిక ఎన్నికలలో దుర్గ్ నుండి ఆమె తిరిగి బిజెపి తరపున నిలబడింది. ఆవిధంగా ఆమె మేయర్, శాసనసభ సభ్యురాలు, ఎంపీ పదవులను గెలుచుకుంది. 2013 ఏప్రిల్ 24న ఆమెను బీజేపి మహిళా మోర్చా (భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం) జాతీయ అధ్యక్షురాలిగా నియమించారు.[4][5] అయితే ఆమె 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన తామ్రధ్వజ్ సాహు చేతిలో ఓడిపోయింది. అయినప్పటికిని ఆమెను భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు, మార్చి 2018లో రాజ్యసభకు కూడా ఎన్నికయింది.[6][7]

పాండే పార్టీ ప్రధాన కార్యదర్శి గా, ఇంకా అధికార ప్రతినిధిగా పనిచేసింది. బిజెపి జాతీయ కార్యదర్శిగాను, తరువాత ఆమె బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించింది.[8]

అవార్డులు, గుర్తింపు మార్చు

సరోజ్ పాండే కు ఒకే సమయంలో మేయర్, ఎంఎల్ఏ, ఇంకా ఎంపి పదవిని నిర్వహించిన ప్రపంచ రికార్డు ఉంది. ఈ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లకు నామినేట్ చేసారు. ఆమెకు దుర్గ్ మేయర్ గా ఎక్కువ కాలం 10 సంవత్సరాలు పనిచేసిన రికార్డు కూడా ఉంది, ఉత్తమ మేయర్ అవార్డును కూడా అందుకుంది.[9]

సూచనలు మార్చు

  1. "Third assembly" (PDF). cgvidhansabha.gov.in. Retrieved 24 August 2020.
  2. "CPI welcomes cheap rice scheme". Indopia. 5 June 2009. Retrieved 23 July 2009.
  3. "Detailed Profile: Km. Saroj Pandey". Government of India. Archived from the original on 24 May 2014. Retrieved 2 June 2017.
  4. "Sushree Saroj Pandey speech while taking charge as Mahila Morcha President: 24.04.2013". YouTube. Bharatiya Janata Party. Archived from the original on 2023-03-13. Retrieved 24 August 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Vijay Goel appointed BJP general secretary". The Hindu. April 2008. Archived from the original on 2008-04-23. Retrieved 23 July 2009.
  6. "A mayor versus a four-time winner". The Hindu. 10 April 2009. Archived from the original on 16 April 2009. Retrieved 23 July 2009.
  7. "Netapedia.in". www.netapedia.in. Retrieved 31 January 2020.
  8. John, Joseph (23 March 2018). "Saroj Pandey: BJP's Saroj Pandey wins Rajya Sabha poll from Chhattisgarh". The Times of India. Retrieved 18 May 2020.
  9. "Detailed Profile: Km. Saroj Pandey". Government of India. Archived from the original on 24 May 2014. Retrieved 2 June 2017.