సిద్ధివినాయక దేవాలయం (సిద్ధాటెక్‌)

మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లా, సిద్ధాటెక్‌ ప్రాంతంలో ఉన్న వినాయకుడి దేవాలయం

సిద్ధివినాయక దేవాలయం, మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లా, సిద్ధాటెక్ ప్రాంతంలోని భీమా నది ఉత్తర ఒడ్డున ఉన్న వినాయకుడి దేవాలయం.[1] మహారాష్ట్రలో అష్టవినాయక అని పిలువబడే ఎనిమిది వినాయక దేవాలయాలలో ఇదీ ఒకటి. అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ఏకైక అష్టవినాయక క్షేత్రమిది.[2]

సిద్ధివినాయక దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:అహ్మద్‌నగర్ జిల్లా
ప్రదేశం:సిద్ధాటెక్
భౌగోళికాంశాలు:18°26′38.81″N 74°43′34.53″E / 18.4441139°N 74.7262583°E / 18.4441139; 74.7262583
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:దేవాలయ శైలీ
చరిత్ర
నిర్మాత:అహల్యా బాయి హోల్కర్

ప్రదేశం మార్చు

కొండపై ఉన్న ఈ దేవాలయం చుట్టూ బాబుల్ చెట్ల మందపాటి ఆకులు ఉన్నాయి. పూణె జిల్లాలోని షిరాపూర్ అనే చిన్న గ్రామం నుండి ఈ దేవాలయానికి చేరుకోవచ్చు, ఇక్కడ నుండి పడవ లేదా కొత్తగా నిర్మించిన వంతెన ద్వారా చేరుకోవచ్చు.[1] దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు, భక్తులు తరచూ కొండపైకి ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు.

చరిత్ర మార్చు

ఈ దేవాలయం విష్ణువుచే నిర్మించబడిందని ఇక్కడి భక్తుల నమ్మకం. కాలక్రమేణా ఈ దేవాలయం నాశనం చేయబడింది. తరువాత, ఒక ఆవుల కాపరి ఈ పురాతన దేవాలయాన్ని దర్శించి సిద్ధి-వినాయకుని విగ్రహాన్ని కనుగొని పూజించగా, ఇతరులు కూడా ఈ మందిరం గురించి తెలుసుకున్నారు.[1]

ప్రస్తుతమున్న ఈ దేవాలయాన్ని 18వ శతాబ్దం చివరలో ఇండోర్ తత్వవేత్త రాణి అహల్యా బాయి హోల్కర్ నిర్మించింది.[3] పేష్వా పాలకుల అధికారి సర్దార్ హరిపంత్ ఫడ్కే నాగర్‌ఖానాను నిర్మించాడు. హరిపంత్ ఫడ్కే 21 రోజులపాటు గుడిని సందర్శించి ప్రతిరోజూ 21 సార్లు దేవాలయ ప్రదక్షిణచేసి, దేవుడిని ప్రార్థించిన తర్వాత తిరిగి కమాండర్-ఇన్-చీఫ్‌గా తన పదవిని పొందాడు.[1] బయటి సభ-మండపాన్ని గతంలో బరోడాకు చెందిన భూస్వామి మైరాల్ నిర్మించాడు. ఇది 1939లో విచ్ఛిన్నమై 1970 పునర్నిర్మించబడింది.

ప్రస్తుతం, ఈ దేవాలయం చించ్వాడ్ దేవస్థాన్ ట్రస్ట్ నిర్వహణలో ఉంది. ఇది మోర్గావ్, తేర్ అష్టవినాయక దేవాలయాలను కూడా పర్యవేక్షిస్తోంది.[4][5]

ఆర్కిటెక్చర్ మార్చు

ఈ దేవాలయం నల్ల రాతితో నిర్మించబడింది. నల్లరాతితో కూడిన సభామండపం, మరొక సభామండపం ఉన్నాయి. ప్రధాన మందిర ప్రవేశద్వారం చిన్న రాక్షస శిరస్సు శిల్పాన్ని కలిగి ఉంది. ఈ దేవాలయంలో నాగర్‌ఖానా కూడా ఉంది.

గర్భగృహ 15 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పులో ఉంది. ఇందులో విష్ణువు నివాస ద్వారపాలకులైన జయ-విజయల విగ్రహాలు ఉన్నారు. గోపురం ఆకారపు రాతి పైకప్పును కలిగి ఉంది.[4] అన్ని అష్టవినాయక పుణ్యక్షేత్రాల మాదిరిగానే, స్వయంభు వినాయకుడిగా నమ్ముతారు.[6] సిద్ధి-వినాయకుని భార్య సిద్ధి పక్కనే కూర్చొని ఉంది. గర్భగుడిలో శివుడు, గణేశుడు, విష్ణువు, సూర్యుడు, శివాయ్ దేవత మందిరం కూడా ఉన్నాయి.

పండుగలు మార్చు

ఈ దేవాలయంలో మూడు ప్రధాన పండుగలు జరుగుతాయి. వినాయక చవితి పండుగను హిందూ మాసం భాద్రపద మొదటి నుండి ఐదవ రోజు వరకు జరుపుకుంటారు. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక జయంతి పండుగను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో వినాయకుడి పల్లకి సేవ ఉంటుంది. విజయదశమి, సోమవతి అమావాస్య, సోమవారం నాడు వచ్చే అమావాస్య రోజు ఇక్కడ జాతర జరుగుతుంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Siddhatek". The Official Website of Ahmednagar District. National Informatics Centre, District –Ahmednagar. 2009. Retrieved 26 August 2011.
  2. Anne Feldhaus (2003). "Connected places: region, pilgrimage, and geographical imagination in India". Palgrave Macmillan. pp. 142, 145–6. ISBN 978-1-4039-6324-6.
  3. Grimes pp. 117-8
  4. 4.0 4.1 "SHREE SIDDHIVINAYAK - SIDDHATEK". Ashtavinayaka Darshan Online. Archived from the original on 2011-09-04. Retrieved 2022-07-05.
  5. As per the official receipt of donation, provided by the Morgaon temple
  6. Grimes pp. 110–1