సెయింట్ జార్జి చర్చి, హైదరాబాదు

సెయింట్ జార్జి చర్చి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబీడ్స్ లో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.[1] 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.[2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

సెయింట్ జార్జి చర్చి
మతం
Ecclesiastical or organizational statusబసిలికా
ప్రదేశం
ప్రదేశంఅబిడ్స్, హైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం

చరిత్ర మార్చు

బ్రిటీషు రెసిడెన్సీ భవనం కోఠిలో ఏర్పాటుచేయడంతో అనేకమంది క్రైస్తవులు చాదర్ ఘాట్, అబిడ్స్ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వారందరికి అందుబాటులో ఉండేందుకు నిజాం ప్రభువు అనుమతితో దాదాపు పదిన్నర ఎకరాల్లో ఈ చర్చి నిర్మించబడింది.[3]

నిర్మాణం మార్చు

దీనికి బ్రిటీషు రెసిడెంట్ సర్ జార్జి యాలే శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. డెబ్భై అడుగుల ఎత్తులో యూరోపియన్ శైలీలో క్రీస్తు శిలువ ఆకారంలో నిర్మించిన ఈ చర్చి ముందు ఎత్తైన పోర్టికో, ప్రార్థనా మందిరంలో రంగూన్ టేకు టేబుళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. చర్చిలోని రంగు అద్దాలపై క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఇతర ఆకృతులు చిత్రించబడ్డాయి.[4]

మూలాలు మార్చు

  1. Itihas, Volume 11, 1983, p.296
  2. "British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad". britishempire.co.uk. Archived from the original on 5 జనవరి 2019. Retrieved 18 March 2019.
  3. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 26 March 2019.
  4. సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43