స్వర్ణలతా నాయుడు

స్వర్ణలతా నాయుడు (సెప్టెంబర్ 8, 1975 - జూలై 3, 2016) యువ కవయిత్రులలో ఒకరు. 2012 సెప్టెంబర్ 5 నుండి కవితలు రాయడం ప్రారంభించి, ఇప్పటివరకు 100 కవితలకు పైనా రచించారు. ఏకవాక్య కవితలు (400 వరకు) కూడా రాశారు. కవి సంగమం రచయితలలో ఒకరు

స్వర్ణలతా నాయుడు
స్వర్ణలతా నాయుడు
జననంస్వర్ణలతా నాయుడు
(1975-09-08)1975 సెప్టెంబరు 8
నాగార్జునసాగర్, నల్గొండ జిల్లా, తెలంగాణ భారతదేశం
మరణంజూలై 3, 2016
మరణ కారణంగుండె సంబంధిత వ్యాధి
వృత్తికవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తనరసింహారావు
పిల్లలుశ్రీశివాని
తండ్రిరాధాకృష్ణ
తల్లిఅనురాధ

జననం - విద్యాభ్యాసం మార్చు

వీరు అనురాధ, రాధాకృష్ణ దంపతులకు 1975, సెప్టెంబర్ 8నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జన్మించారు. ఖమ్మంలో ఉండండ వల్ల డిగ్రీ వరకి అక్కడే చదివారు. అనంతరం హైద్రాబాద్ లోని వనితా కళాశాలలో జంతుశాస్త్రంలో ఎం.ఎస్సీ చేశారు.

దస్త్రం:Jwalinchina Ragalu Cover Photo.jpg
జ్వలించిన రాగాలు పుస్తక ముఖచిత్రం
దస్త్రం:Poolapitta Cover Photo.jpg
పూలపిట్ట పుస్తక ముఖచిత్రం

భర్త - పిల్లలు మార్చు

1999 ఆగస్టు 27న సోమిశెట్టి నరసింహారావుగారితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప (శ్రీశివాని).

ప్రచురితమయిన మొదటి కవిత మార్చు

హిమవర్షం అనే కవిత ఆంధ్రభూమిలో ప్రచురితం అయింది.

కవితల జాబితా మార్చు

మబ్బుల పల్లకి, తీపి తెలుగు, వలపుల సంద్రం, నా రాజు, అమ్మ, స్వాతంత్ర్యం, కాలానికి రంగులద్దుకోవాలి,[1] ఉదయకాంతుల ఉగాది,[2] వంటి కవితలు వివిధ పత్రికలలో 90 కవితలపైనే అచ్చయ్యాయి. వీరి కవిత NATA లో కూడా ప్రచురితం అయింది.

ప్రచురితమయిన పుస్తకాల జాబితా మార్చు

  • శ్రీస్వర్ణ కిరణాలు 2014 మే 24న విడుదలైంది.

మరణం మార్చు

గత కొన్ని రోజులుగా హార్ట్ ప్రాబ్లంతో హాస్పటల్ లో చికిత్సపొందుతూ 2016, జూలై 3 న తుదిశ్వాస విడిచారు.

శ్రీ స్వర్ణ కిరణాలు ...ఆవిష్కరణ చిత్రమాలిక మార్చు

జ్వలించిన రాగాలు, పూలపిట్ట... ఆవిష్కరణ చిత్రమాలిక మార్చు

ఇతర చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ. "కాలానికి రంగులద్దుకోవాలి". Retrieved 3 July 2017.
  2. నమస్తే తెలంగాణ. "ఉదయకాంతుల ఉగాది". Retrieved 3 July 2017.

లింకులు మార్చు