అజంతా ఎక్స్‌ప్రెస్

అజంత ఎక్స్ ప్రెస్ సికింద్రాబాదు-మన్మాడ్ పట్టణాల నడుమ నడిచే భారతీయ రైల్వేలకు చెందిన ఒక రైలు. షిరిడి వెళ్ళే శ్రీ సాయి బాబా భక్తులకు ఎంతో ప్రయోజనకరముగ ఉంటుంది.ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాదు మండలం వారిచే నడుపబడుచున్నది.

Ajanta Express at Dayanandnagar Railway Station, Hyderabad
Ajanta Express
Ajanta Express at Manmad yard

చరిత్ర

మార్చు

తెలంగాణ, మరాఠ్వాడ ప్రాంతాల మధ్య నడిచే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రైలు అజంత ఎక్స్ ప్రెస్ . 1967, ఏప్రియల్ 1-వ తేదీ, శనివారము నాడు ఈ రైలు కాచిగూడ-మన్మాడ్ మధ్య మీటర్ గేజ్ పై ప్రవేశపెట్టబడింది. మన్మాడ్-పర్భణి మధ్య రైల్వే లైను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కు మార్చబడ్డప్పుడు, ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను ఇంకను మీటర్ గేజ్ పైనే ఉండెను. అప్పుడు ఈ రైలు వికారాబాద్-బీదర్-పరళి వైద్యనాథ్-పర్భణి మీదుగా మళ్లింపబడెను. 2007 లో ముద్ఖేడ్-సికింద్రాబాద్ పూర్తిగా బ్రాడ్ గేజ్ గా మార్చబడిన పిమ్మట ఈ రైలు మఱల నిజామాబాద్-బాసర-ముద్ఖేడ్-నాందేడ్-పర్భణి మీదుగా మళ్లింపబడింది. ప్రవేశపెట్టబడ్డప్పుడు ఈ రైలు దేశంలో అత్యంత వేగంగా నడిచే మీటరు గేజ్ రైలుగా ప్రఖ్యాతి గాంచింది.


బండి సంఖ్య

మార్చు

17064 సికింద్రాబాద్ జంక్షన్ -> మన్మాడ్ జంక్షన్

17063 మన్మాడ్ జంక్షన్ -> సికింద్రాబాద్ జంక్షన్

పెట్టెల వివరములు

మార్చు

శీతలీకరింపబడిన రెండవ తరగతి పెట్టె -1

శీతలీకరింపబడిన మూడవ తరగతి పెట్టె -2

పడక వసతి కలిగిన రెండవ తరగతి పెట్టెలు -15

కూర్చొను వసతి కలిగిన రెండవ తరగతి పెట్టెలు -3

కూర్చొను మఱియు సామాగ్రి పెట్ట్టుకొను పెట్టెలు- 2

మూలాలు

మార్చు