అమ్ము స్వామినాథన్
అమ్ము స్వామినాథన్ లేదా అమ్ముకుట్టి స్వామినాథన్ (1894–1978) భారతీయ రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త. ఆమె భారత స్వాంతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ సభ్యులు.
అమ్ము స్వామినాథన్ | |||
పార్లమెంట్ సభ్యులు
| |||
---|---|---|---|
పదవీ కాలము 1951 – 1957 | |||
ప్రధాన మంత్రి | పండిట్ జవహర్లాల్ నెహ్రూ. | ||
ముందు | None | ||
నియోజకవర్గం | దిండిగల్ లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1894 | ||
మరణం | 1978 పాల్ఘాట్ జిల్లా | ||
జాతీయత | భారతీయులు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | డా. సుబ్బరామ స్వామినాథన్ | ||
వృత్తి | రాజకీత వేత్త | ||
మతం | హిందూ |
ప్రారంభ జీవితంసవరించు
అమ్ముకుట్టి స్వామినాథన్ కేరళ రాష్ట్రంలోని పాల్ఘాట్ జిల్లా లోని అనక్కర యొక్క వదక్కాత్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి గోవింద మీనన్. ఆయన స్థానిక అధికారి. అమ్ముకుట్టి యొక్క తల్లిదండ్రులు నాయిర్ కులానికి చెందినవారు. వారికి గల సంతానంలో ఈమె కనిష్ఠ పుత్రిక. 13 వ యేట ఆమె వివాహం డా. సుబ్బరామ స్వామినాథన్ తో సాంప్రదాయ పద్ధతులలో జరిగింది. ఆయన బ్రాహ్మణ కుటుంబీకుడు. ఆమె భర్త మద్రాసులో బారిష్టరుగా యున్నారు. ఆయన లండన్ విశ్వవిద్యాలయంలో బారిష్టరు చదివారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను న్యాయశాస్త్రంలో చేశారు.
కెరీర్సవరించు
అమ్ము జీవితం డా.స్వామినాథన్ తో వివాహం చేసుకున్న తరువాత అనేక మార్పులకు గురైంది.ఆయన ఆమె కన్న 20 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన ఆమె ప్రతిభను గుర్తించి ఆమె అభివృద్ధికి ప్రోత్సహించాడు. ఆయన ప్రభావంతో ఆమె మహాత్మా గాంధీ అనుచరురాలిగా మరియు శిష్యురాలిగా మారి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభలో సభ్యురాలిగా యున్నారు.