అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాదు

అష్టలక్ష్మీ దేవాలయం భారత దేశము లోని తెలంగాణ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ప్రధాన దైవంగా గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

Ashtalakshmi Temple
అష్టలక్ష్మీ దేవాలయం
Ashtalakshmi Temple అష్టలక్ష్మీ దేవాలయం is located in Telangana
Ashtalakshmi Temple అష్టలక్ష్మీ దేవాలయం
Ashtalakshmi Temple
అష్టలక్ష్మీ దేవాలయం
తెలంగాణలో ప్రదేశం
భౌగోళికాంశాలు:17°21′53″N 78°32′52″E / 17.364693°N 78.547896°E / 17.364693; 78.547896
పేరు
స్థానిక పేరు:అష్టలక్ష్మీ దేవాలయం
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:హైదరాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:లక్ష్మీ
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1996

హిందూ పురాణాల ప్రకారం, ఈ దేవత ధన సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీ దేవత సంపదనిచ్చే దేవతగా హిందువుల హృదయాల్లో స్థిరపడింది. కానీ కొన్ని దేవాలయాలు మాత్రమే లక్ష్మీ యొక్క ఎనిమిది రూపాలతో కూడుకొని అష్టలక్ష్మీ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినవి.

చరిత్ర మార్చు

ఈ దేవాలయం ఏప్రిల్ 1996 లో కంచి కామకోటి పీఠం వారి అధ్వర్యంలో నిర్మించబడింది. ఈ దేవాలయం తెలంగాణలో ప్రసిద్ధమైనది. ఇది దిల్‌సుఖ్ నగర్, ఎల్.బి.నగర్ ల మధ్య కొత్తపేట (ఎన్.హెచ్.5) దగ్గరలో గల వాసవి కాలనీలో ఉంది.

నిర్మాణశైలి మార్చు

ఈ దేవాలయ డిసైన్, వాస్తుశైలులను చెన్నై నుండి తీసుకొనడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో అనేక మార్పులు చేయడం జరిగింది. ఈ దేవాలయం సమష్టి కృషికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ దేవాలయ నిర్మాణంలో అనేక మంది ప్రజలు విరాళాలనందించారు. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు ఐదు సంవత్సరాల కాలం పట్టినది. ఈ దేవాలయ ప్రస్తుత రూపంలోనికి రావడానికి నిర్మాణ ఖర్చు 10 మిలియన్ల రూపాయలు అయినది.

ప్రసిద్ధ నిర్మాణ శిల్పి పద్మశ్రీ ఎస్.ఎం.గణపతి, ఎం.మతియాలగన్ స్థపతులు ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని రూపకల్పన చేశారు. సుమారు 134 విగ్రహాలు ఈ దేవాలయ మహాగోపురంలో నెలకొల్పబడినవి.

ఈ దేవాలయం ఇసుక, సిమెంటులతో నిర్మించినప్పటికీ దీని నిర్మాణ శైలి అది రూపొందించిన కళాకారుల విశేష ప్రతిభను కనబరుస్తుంది. ఈ దేవాలయంలో గల విగ్రహాలలో ఆదిలక్ష్మీ, ఐశ్వర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ, ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ, వరలక్ష్మీ ప్రధానమైనవి. ఈ దేవతలు అలంకరణలను బంగారు, కాసులపేర్ల హారాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించినవారిలో కొందరు విగ్రహాల శిల్పకళ, అలంకరణలను గూర్చి ప్రస్తుతిస్తే మరికొంత మంది ఆ ఆలయ గోపురంలో గల వివిధ విగ్రహాలను గూర్చి ప్రస్తుతిస్తారు.

ఈ దేవాలయ పరిథిలో సుమారు 15 మిలియన్ల రూపాయలతో ఒక కళ్యాణ మంటపం, అర్చకుల నివాసం కోసం అర్చక నిలయం నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి.

రాత్రి వేళలలో ఈ దేవాలయం విద్యుద్దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కొంత దూరం నుండి వీక్షించేటప్పుడు పాలరాతి నిర్మాణంలా కనిపిస్తుంది.

మూలాలు మార్చు

గ్యాలరీ మార్చు

ఇతర లింకులు మార్చు