ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (AP State Council for Education Research and Training, (APSCERT) ) 27-07-1967 న, అప్పటికే వున్న రాష్ట్ర విద్యాసంస్థ, రాష్ట్ర విద్యా, వృత్తిపర సలహా బ్యూరో, రాష్ట్ర వైజ్ఞానిక విద్య సమితి, రాష్ట్ర మూల్యాంకన సమితులను కలగలిపి ఏర్పడినది.[1]

NCERT, Andhra Pradesh

లక్ష్యాలు మార్చు

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక సేవలలో వున్న ఉపాధ్యాయులకు, వారికి శిక్షణఇచ్చే ఉపాధ్యాయులకు శిక్షణ
  • విద్యా విషయాలలో ఆలోచనలు, సమాచార వినిమయానికి కేంద్రంగా వ్యవహరించుట
  • పాఠశాల విద్యావిషయక సలహాలు ఇచ్చుట
  • విద్యావిషయక కార్యక్రమాలపై అధ్యయనాలు, సర్వేలు చేయుట
  • విద్యా సమస్యలు, బోధనా పద్ధతులపై పరిశోధన కార్యకలాపాలను చేయట, సమన్వయం చేయుట
  • పుస్తకాలు, పత్రికలు, దృశ్యశ్రవణ సామాగ్రి తయారుచేయుట
  • రాష్ట్రంలో విద్యా కార్యక్రమాల ప్రభావాన్ని మూల్యాంకనం, అధ్యయనం చేయుట

మూలాలు మార్చు

  1. "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ జాలస్థలి". Archived from the original on 2015-08-01. Retrieved 2020-01-13.