ఎం.కృష్ణస్వామి.

భారతీయ రాజకీయవేత్త

ఎం.కృష్ణస్వామి తమిళనాడులోని ఆరణి నియోజకవర్గం నుండి 15వ లోక్ సభకు గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాల్యం మార్చు

ఎం.కృష్ణస్వామి 1940 జూన్ 9లో తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని మేలేపట్టు గ్రామంలో జన్మించాడు. వీరి తల్లి దండ్రులు ఎ.మురుగ గౌండర్, శ్రీమతి....

విద్య మార్చు

ఈయన మద్రాసు లా కాలేజీలో బి.ఎ. బి.ఎల్. చదివారు. కొంత కాలం న్యాయవాద వృత్తిని చేపట్టారు.

కుటుంబము మార్చు

వీరు 1966 సెప్టెంబరు 2 న కె.వి.చిత్రను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తానము మార్చు

కృష్ణస్వామి 1980-82 లో తమిళనాడు కాంగ్రేస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 1991లో 10 వ లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2006 నుండి 2008 వరకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. 2009 లో కాంగ్రేస్ పార్టీ తరుపున పార్లమెంటు సభ్యత్వానికి పోటీ చేసి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు.

విదేశీ పర్యటన మార్చు

వీరు ఐరోపా దేశాలు, జపాన్., మలేసియా మంగోలియా సింగ పూర్, అమెరికా వంటి దేశాలు పర్యటించారు.

మూలాలు మార్చు

https://web.archive.org/web/20130201171618/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=3526