కందిమళ్ల ప్రతాపరెడ్డి

కందిమళ్ల ప్రతాపరెడ్డి రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల కమిటీకి కన్వీనర్. అతను రావి నారాయణరెడ్డి వద్ద చాలాకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాడు.[1] అతను తెలంగాణ సాయుధ పోరాటంలో బాల గెరిల్లాగానూ, ముఖ్య నాయకులకు కొరియరుగానూ పనిచేసాడు.[2]

కందిమళ్ల ప్రతాపరెడ్డి

రచనలు మార్చు

  1. ఖానూన్ (నవల)
  2. బందూక్ (నవల) : నిజాం పాలిత ప్రాంతంలో యధేచ్ఛగా కొనసాగిన దొరల అకృత్యాలనూ, రజాకార్ల అమానుషాలనూ, ఆరాచకాలనూ ఈ నవల చిత్రించింది.
  3. వీరతెలంగాణ సాయుధ సమరం[3]
  4. నీ కవిని బతికించుకోవాలిరా (సంపాదకత్వం)
  5. భారత స్వాతంత్ర్య సమరవీరులు[4]
  6. బద్దం ఎల్లారెడ్డి సంక్షిప్త జీవిత పరిచయము

పురస్కారాలు మార్చు

  • 2006లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.[5]

పదవులు మార్చు

  • కార్యదర్శి - తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు
  • జాతీయ కార్యదర్శి - ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ (ఇప్టా)

మూలాలు మార్చు

  1. "ఆదర్శ నేత రావి నారాయణరెడ్డి". www.andhrajyothy.com. Archived from the original on 2021-05-14. Retrieved 2020-07-05.
  2. సత్యనారాయణ, డా ఎస్పీ (2008-04-18). "బాల గెరిల్లా జ్ఞాపకాల కథనం". telugu.oneindia.com. Retrieved 2020-07-05.
  3. "Veera Telangana Sayudha Samaram (Telugu) - 2007". Chirukaanuka. Retrieved 2020-07-05.
  4. "Bharata Swatnatrya Samaraveerulu - భారత స్వాతంత్ర్య సమరవీరులు by Kandimalla Pratapa Reddy - Bharata Swatnatrya Samaraveerulu". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-05. Retrieved 2020-07-05.
  5. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.