కాన్పూరు
కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగర్ జిల్లాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం. భారతదేశంలోకెల్లా అత్యధిక జనాభా గలిగిన ప్రాంతాల్లో 12 వస్థానంలో ఉన్న నగరం. ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 1959 లో ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేశారు.కాన్పూర్ నగరానికి ఆ పేరు కర్ణుని పేరు మీదుగా వచ్చిందని చెబుతారు.ఈ ప్రాంతం తోళ్ళ వ్యాపారానికి ప్రసిద్ది చెందింది
కాన్పూరు | |
---|---|
![]() Clockwise from top right: Green Park Stadium; Civil Lines district; Kanpur Police headquarters; Landmark Hotel; Kanpur Memorial Church; JK Temple |
చరిత్రసవరించు
1207 లో కణ్హ అనే రాజు కణ్హాపురా అనే గ్రామాన్ని నిర్మించాడు. ఆ గ్రామం కాలక్రమంలో కాన్పూర్ గా మారింది. ప్రప్రధమ భారత స్వాతంత్ర పోరాటం 1857 లో కాన్పూర్ కీలకమయిన పాత్రను పోషించింది.ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా భారతీయ సిపాయిలు నానా సాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసారు.
జనాభాసవరించు
2011 జనాభ లెక్కల ప్రకారం కాన్పూర్ నగర జనాభా 2,767,031.అక్షరాస్యత సుమారు 84 శాతం.లింగ నిష్పత్తి 842 (1000 పురుషులకు). కాన్పూర్ లో హిందుమతాన్ని సుమారు 78 శాతం మంది,ఇస్లాం ను సమారు 20 శాతం మంది అనుసరిస్తున్నారు