కిరణ్ క్రాంతి చౌదరి

భారతీయ కళా చరిత్ర సమాఖ్య ( ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ ) జనరల్ ప్రెసిడెంట్ గా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆర్కియాలజీ విశ్రాంతచార్యులు డి. కిరణ్ క్రాంత్ చౌదరి 2023 మే 17వ తేదీన నియమితులయ్యారు[1]. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తి ఈయనే. 2024 ఫిబ్రవరి నెలలో జరగబోయే సమాఖ్య 31వ వార్షిక సదస్సుకు ఈయన జనరల్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నారు. కిరణ్ క్రాంత్ చౌదరి శిల్ప, వాస్తు కలలో అరుదైన పరిశోధనలు చేశారు[2]. 'స్పెండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ పెయింటింగ్స్' గ్రంధాన్ని వెలువరించారు.

మూలాలు :

  1. "దేశ చరిత్రను కాపాడేది ఆచార్యులే". EENADU. Retrieved 2023-08-24.
  2. "Constitutional Provisions | UPSC". upsc.gov.in. Retrieved 2023-08-24.