కౌసల్యా సుప్రజా రామ

"కౌసల్యా సుప్రజారామ" అనే శ్లోకం శ్రీరామాయణంలో బాలకాండ లోనిది. రామ లక్ష్మణుల గురువైన విశ్వామిత్రుడు నిద్రిస్తున్న శిష్యులను ఈ శ్లోకంతో మేల్కొలుపుతాడు.

రామ లక్ష్మణుల గురువైన విశ్వామిత్రుడు నిద్రిస్తున్న శిష్యులను "కౌశల్యా సుప్రజారామ" శ్లోకంతో మేల్కొలుపుతాడు.

ఈ శ్లోకం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో వేంకటేశ్వరుడిని మేల్కొలపడానికి కూడా ఆలపిస్తారు. ఇది తిరుమలలో బంగారు వాకిలి వద్ద ప్రతీ రోజూ ఉదయం దేవాలయ తలుపులను తెరిచే సందర్భంలో మొట్టమొదటగా ఆలపిస్తున్న శ్లోకం.

శ్లోకం:

కౌసల్యా సుప్రజారామ

పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్ధూల



   Nm

కర్తవ్యం దైవమాహ్నికం


తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.O OO.k

మూలాలు మార్చు