గొండ్లి నృత్యం

(గొరగ పడుచుల గొండ్లి నృత్యం నుండి దారిమార్పు చెందింది)
గిరిజన నృత్యం

గొరగ పడుచుల గొండ్లి నృత్యం మార్చు

వీరు మైలార దేవర వీర భటుల గొండ్లి యాడించు చున్నారు గొరగ పడుచు నాడుచున్నది చూడు మూర్థాభిఅయము తాను నెట్టి క శీలంత గాని లేదు .............. క్రీడాభిరామ:

కాకతీయుల కాలంలో గొండ్లి అనే కుండలాకార నృత్యం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మల ఉత్సవాల సమయాల్లో పిల్లన గ్రోవు లూదుతూ, ఆటలు, ఆడుతూ కుండలాకార నృత్యాలు చేసి నట్లు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి గొండ్లి నృత్యాలు అనాదిగా మన సంస్కృతితో సంబంధమున్నట్లు తెలుసు కోవచ్చును.

భిన్నాభిప్రాయాలు మార్చు

గొండ్లి నృత్యాన్ని గూర్చి పండితుల్లో వివిధ అభిప్రాయ లున్నట్లు నాటరాజ రామ కృష్ణ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో వివరించారు.

గొండ్లి అనేది కుండలాకారంగా చేయబడే నృత్యమనీ, అది కుందలి నృత్యమనీ కొందరు పండితులు అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే నంది కేశుడు తన భరతార్ణవంలో శుద్ధ, దేసి, పేరిణి, ప్రేంకణం, కుండలి, దండిక, కలశములనే సప్త దేశి తాండవ రీతుల్ని గూర్చి వివరించాడు. అందులో కుండలి నృత్యాన్ని గురించి పరిశోధించి నట్లైతే అది శాస్త్రీయ కరణాంగహార చారీ భేదాలతో కూడిన నృత్యంగా తెలుస్తూడి. అంతే గాక అది కుండలాకారం చేయబడే నర్తనం కాదు, బృంద నర్తనం అసలే కాదనీ, ఏక పాత్ర నృత్య కేళిక విధానం కుండలి అని అంటారు రామకృష్ణగారు.

కుండ నృత్యంలో, నారాయణ కరణము ముత్తల్లికాచారి .............. లక్ష్మీ శతాళంతో ప్రదర్శిత మౌతుంది.

గొండ్లి, గోడులు మార్చు

గొండ్లి అంటే అది గోడులచే చేయబడే నృత్యంగా పేర్కొన్నారు. గోండులు అతి ప్రాచీనమైన తెగకు సంబంధించిన వారు. వీరిది ప్రాచీనమైన సంస్కృతీ వికాసం గల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో రాజ గోండులు ముప్పై ఆరు సంస్థానాలను స్థాపించుకుని చత్తీసు ఘడ్ పేరుమీద రాజ్యపాలన చేశారు.

ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఘడ్ గా పిలువబడుతూ ఉంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోడులు పాలించారు. ఆనాడు ఆంధ్ర దేశాన్ని పారిపాలించిన రాజులకూ, వారికీ సన్నిహిత సంబంధాలుండడం వల్ల గోడులలో వున్న నృత్త రీతులు ఆంధ్ర దేశంలో కూడా ప్రచార మయ్యాయి. పల్లెల్లో నివసించే గోండులు ప్రదర్శించే నృత్యాలన్నిటి లోనూ, ఖర్మనృత్యం చాల ప్రాముఖ్యం వహించిందట.

ఖర్మ నృత్యం మార్చు

ఖర్మ నృత్యమంటే వర్షరుతువు ప్రారంభమయ్యే రోజుల్లో పంటలు బాగా పండాలని రైతులు చేసే ధర్తీమాత ఆరధనా నృత్యమిది. ఖర్మ నృత్యంలో బాగా చిరురించినవిప్ప కొమ్మను తీసుకువచ్చి, ఇల కొత్త గుడ్డలో వుంచి వారి వారి ఇళ్ళలో వుంచుతారు, వారు అనుకున్న రోజున పెద్ద పండగ చేస్తారు. అందరూ ఆనందంగా విందు భోజనాలు చేస్తారు. తరువాత, జంత్ర వాయిద్యాలు, మృదంగ శబ్దాలు మ్రోగు తుండగా, స్త్రీలూ పురుషులూ కలిసి ఆ విప్ప కొమ్మల చుట్టూ తిరుగుతూ, ప్రేమ గీతాల్నీ, ప్రకృతి రామణీయక గీతాల్నీ పాడుతూ అద్భుతంగా నృత్య చేస్తారట. దీనిని వారు ఖర్మనృత్య మంటారు. ఇది ఒక్కగోండులే గాక, ఇతర అడవి జాతుల వారు కూడా ముఖ్యమైనదిగా ఎంచి నృత్యం చేస్తారు. ఈ విధంగా నృత్య గీతాలతో ఖర్మ వృక్షాన్ని ఆరాధించి భగవంతుని సంతోష పెడితే పంటలు దండిగా పండుతాయని వారి విశ్వాసం.

బృంద నృత్యం మార్చు

ఇది కేవలం బృందనృత్యం, స్త్రీలు, పురుషులు కలిసి చేసే నృత్యమిది. ఈ నృత్యం చతురశ్ర తిశ్రా' ఏక తాళ గతిలో చేయ బడుతుంది.

వీరి గీతాలు కొన్ని అధ్యాత్మిక పరంగానూ కొన్ని ప్రణయ గీతాలు గానూ, మరి కొన్ని హాస్యరస ప్రాధాన్య త కలిగినవి గానూ వుంటాయి. వారి పాటలీ విధంగా వుంటాయి.

నీ సరీరమును చూచి పొంగకయ్యా అది ఒకారోజు పైకి పోవాల్సిందేగా నీ తల్లి దండ్రీ చుట్టములు, . బంధువులు అందరిని విడిచి పోవాలి నీ యింటిలో నున్న లక్షల ఆస్తిని గూడా మరణ కాలంలో వదలి పోవాలి.

ఇంకా ఈ విధంగా........

వాద్యములు పలుకుతున్నాయి ఆ సంగీతాన్ననుసరించి పాదము భూమిపై నృత్యమాడు తూంది విడాకులిచ్చిన స్త్రీకి ఒక పైసా ఉంపుడు గత్తెకు రెండూ, కానీ అన్నె పున్నెము లెరుగని అబలకు ఎన్నో వేల మంచి శబ్దములు గల బంగారు నాణెములు.

గోండలీల, గొండ్లి నృత్యము మార్చు

గోండలీ తెగకు చెందిన వారు మహారాష్ట్రంలో చాల మంది ఉన్నారు. నృత్యం చేయడమే వీరి ముఖ్య వృత్తి.

గోండలీలు ఆంధ్ర్రడేశంలో జంగం వారి వంటి వారు. పెళ్ళి మొదలైన శుభ కార్యాలలో గొండ్లిని ప్రదర్శిస్తారు.

నృత్యం చేసే వారి వేష ధారణ, పాదాల వరకూ బుడుగుగా వున్న ఒక కుచ్చుల అంగరకాను గవ్వలతో చేయబడిన ఒక మాలను ధరించి కాళ్ళకు గజ్జెలు కట్టీ తలకు మార్వాడీ తల పాగ చుట్టి కథా నాయకుడు తయారైతే మిగిలిన ముగ్గురూ అతనికి వంతగా నిలబడతారు. అందులో ఇద్దరు చెరో ప్రక్కన బుండి మృదంగాన్ని వాయిస్తే.............. మూడవ వ్వక్తి వెలుగు కోసం దివిటీ పట్టుకొని నిలబడిన వ్వక్తి విదూషకుడు గానూ, అవసరమైతే వేషధారిగాను సహకరిస్తాడట. వీరు భవానీ స్తోత్రం ప్రారంభంతో నృత్యాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభానికి ముందు ఒక బల్లపైన గోధుమలు పరచి, దానిపైన నీళ్ళోఅతో నిందిన ఒక చెంబును కొబ్బరి కాయ పెట్టి దానిని కలిశంగా తయారు చేసి ఆ కలిశాన్ని భవానీ దేవి రూపంగా ఎంచి నృత్యం పూర్తి చేస్తారు. నృత్యానంతరం కొబ్బరి కాయ కొట్టి అందరికీ ఫలహారంగా ఇస్తారు.

ప్రజారంజకమైన ప్రదర్శనం: మార్చు

ముఖ్యంగా వీరిని పెళ్ళి మొదలైన శ్సుభ కార్యాలకు ఆహ్వానిస్తారు. ఒకోసారి కేవలం, వినోద కాలక్షేపంగా కూడా ప్రదర్శనం ఇస్తారు. ఈ ప్రదర్శనంలో ప్రధాన కథకుడు ముందు వెనుకలకు నడుస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తాడు. వాద్యకులు అతన్ని అనుసరిస్తూ, కథకుని కష్టంలో పాలు పంచు కుంటూ, మధ్య మధ్య హాస్య చలోక్తులను విసరుతూ ప్రజలకు విసుగు లేకుండా వారిని అలరిస్తాడు. ఈ నృత్యం అధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన తాందావ నృత్య రీతి అంటారు. నటరాజ రామ కృష్ణ, వీరి నర్తన తీరుకు ఒక ఉదాహరణ.

గొండ్లి నృత్యం తీరు మార్చు

నృత్య కథా ఇతివృత్తం అధ్యాత్మిక ప్రబోధానికి సంబంధించింది. నేనెవర్ని ఇక్కడ నుండి వచ్చాను. ఈ పరమ రహస్యం ఇంత వరకూ ఎవరూ తెలుపరైది.అంటూ............

నర్తన గీతం

తల్లీ తండ్రీ - అక్క తమ్ముడు - వీరంతా మాయ వీరంతా నావాఅరేనని తలచి స్వార్థంకోసం వీవితం వృథా పుచ్చుకున్నాను విషయ వాంఛ నరకానికి మొదటి మెట్టు మానవుడు ఈ కారణం లేక దానిలో చిక్కు కున్నాడు ......... ఓయీనరుడా| నీ గురువుని తలుచుకో ...... (ఓఅంటే జ్ఞాన మిచ్చే వాడని అర్థం)

గొండ్లి, గోడలీ, నృత్యాలన బడేవి మధ్య ప్రదేశ్ మహా రాష్ట్రాలలో ప్రదర్శింప బడుతున్న, మూడు రాష్ట్రాల సరిహద్దులూ, అరణ్య ప్రాంతాలవడం, అడవి జాతుల గిరిజనులు ఇరుగు పొరుగు సంబంధాలూ, బాంధవ్వాలూ, రాకపోకలతో, తెలుగు దేశంలో కూడా సరిహద్దు ప్రాంతాలలో, గోండ్లి, గోండలీ నృత్యాలు జీవించి ఉన్నాయి. గొండ్లి నృత్య కథా ఇతి వృత్తాలను బట్టి చూసినా ప్రదర్శించే ప్రదర్శన విధాన్నాన్ని చూసినా తెలుగు నాట ప్రదర్శింప బడే, బుర్ర కథ, పంబ కథా, జముకుల కథ, ఒగ్గు కథ మొదలైన కథల బాణీలో ఉంది..... ఇది కేవలం జానపద నృత్యం అంతేకాదు. గిరిజనుల నృత్యం కూడా, గొండ్లి నృత్యం....... శైవ సంప్రదాయాన్ని ప్రచారం లోకి తీసుకు వచ్చింది. మహా రాష్ట్రంలో కూడా, ఈ నృత్యాన్ని దేవీ స్తోత్రంగా చేస్తున్నారు. ఇక గోండుల ఖర్మ నృత్యం గిరిజనుల్లో తప్పా, జానపద నర్తకుల, నర్తన రీతుల్లో మనకు ఎక్కడా కనిపించదు...... జంగంకథా, గొండ్లి ఒకే రకమైన కళారూపంగా వర్థిల్లి వుండ వచ్చని నటరాజ రామ కృష్ణ గారు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నాటికీ గోండు జాతి నృత్యాలు మార్చు

ఈ నాటి తెలంగాణాలో కేసలాపురం భీమదేవు దేవాలయం గోడు జాతికి సంధించింది. ఇక్కడ గోండు జాతివారు గొప్ప జాతర జరుపుతారు. జాతర వుష్య మాసం తరువాత ప్రారంభమౌతుంది. పదిహేను రోజులపాటు జరుగుతుంది.

వేలాది గోడు జాతి ప్రజలు గుమికూడతారు. ఈ ఉత్సవంలో పాల్గొన డానికి గోండు కవులూ, వాయిద్య కారులూ, పాటకులూ అందరూ హాజరయి ప్రధాన వాయిద్యాలను వాయిస్తూ వుండే పాట కాండ్రు భక్తి గీతాలు పాడతారు. ఈ వుత్సవాలలో వివాహ మైన పెళ్ళి కూతుళ్ళు, ప్రధాన పాత్రలు వహిస్తారు. విగ్రహం ముందు నిలబడి రాత్రి తెల్లవార్లూ తన్యయత్వ భావంతో వివిధ రకాలైన నృత్య ప్రదర్శనాలు జరుపుతారు. ఈ ప్రదర్శనలకు గోండు ప్రజలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడా హాజరై ఆనందిస్తారు.

మూలాలు మార్చు