చంద్రికా పరిణయం

తెలుగు పద్యకావ్యం


చంద్రికా పరిణయము ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్థానము ను పాలించిన సురభి మాధవ రాయలు రచించారు.

చంద్రికా పరిణయం
కృతికర్త: సురభి మాధవ రాయలు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్
విడుదల: 1904, 1982

ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ.

ఈ కావ్యం 1904 లో తొలిసారిగా ముద్రించబడినది. దీనికి అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఈ రచనను తొలిసారిగా 1982 ముద్రించగా; దీనికి విపులమైన పీఠికను చేర్చి, సంపాదకునిగా కేశవపంతుల నరసింహశాస్త్రి సేవలందించారు.

పిదప పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని పునర్ముద్రించినది.

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: