చరిత్ర ధన్యులు చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రాసిన పుస్తకం.[1]

చరిత్ర ధన్యులు
కృతికర్త: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి
ప్రచురణ: రౌతుబుక్ డిపో, రాజమహేంద్రవరం
విడుదల: 1955
పేజీలు: 126
ప్రతులకు: రౌతుబుక్ డిపో, రాజమహేంద్రవరం

విశేషాలు మార్చు

ఇందులో రచయిత శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.

చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది.

పుస్తకంలో... మార్చు

  1. శాలివాహనుడు - సాహిత్య రక్తి
  2. మాధవవర్మ - బహుశక్తి
  3. గొంకరాజు - ప్రభుసేవానక్తి
  4. అన్నమయ్య - దైవభక్తి

మూలాలు మార్చు

  1. "చరిత్ర ధన్యులు | CharitraDhanyulu". www.freegurukul.org. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు మార్చు