చర్చ:మిట్టచింతవారి పల్లె

    అరవపల్లి

— రెవిన్యూ గ్రామం — రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ జిల్లా చిత్తూరు జిల్లా మండలం పుంగనూరు ప్రభుత్వము జనాభా (2001)

- మొత్తం 	94,784
- పురుషులు 	47,586
- స్త్రీలు 	47,198

అక్షరాస్యత (2001)

- మొత్తం 	64.71%
- పురుషులు 	75.86%
- స్త్రీలు 	53.49%

పిన్ కోడ్ :517247 అరవపల్లి ,పుంగనూరులో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణములో, మండలములో వున్నది. ఈ ఊరికి "Temple town" అని ముద్దు పేరు కలదు. ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ కలవు. బ్రిటిష్ హయాములో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉన్నది. అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రి లో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉన్నది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.పుంగనూరు చింతపండు మరియు పశువుల వ్యాపారంలో దేశం లోనే ప్రఖ్యాతి గాంచినది. మరియు ఈ తాలూకాలో ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ దేవస్థానం కలదు.

పుంగనూర్ అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువ బడు తున్నది. తిమ్మ రాయలు సంతతి వారు పుంగ నూరు జమీందారలుగా వుండే వారు. 1866 లో ఈ సంస్థానంలో ఒక అందమైన ప్యాలెస్ ను నిర్మీంచారు. స్వాతంత్రానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో జమీందార్లు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో ఈ రాజ మహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు ఈ మహల్ లో గ్రందాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. ప్యాలెస్ వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం కలదు. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి వున్నది. ఇక్కడే ఒక బావి వున్నది. గతంలో నేరస్తులకు మరణ సిక్ష విధించి ఈ బావిలో వడవేసె వారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అస్టబందం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి ఈ నాటికి వున్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం ఈ రాజ మహల్ శిధిలావస్తలో వున్నది.

Return to "మిట్టచింతవారి పల్లె" page.