చౌలపల్లి ప్రతాపరెడ్డి
చౌలపల్లి ప్రతాపరెడ్డి (Chowlapalli Pratap Reddy) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను జూలై 7, 1956న[1] షాద్నగర్ మండలం దూసకల్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బి.కాం. వరకు విద్యనభ్యసించాడు. 1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] 1995 స్థానిక సంస్థల ఎన్నికలలో షాద్నగర్ జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 2002 నుండి 2004 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో[3] ఎన్నికయ్యాడు.
చౌలపల్లి ప్రతాపరెడ్డి | |||
నియోజకవర్గము | షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దూసకల్ | 7 జులై 1956||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానము | ఇద్దరు కుమారులు |
కుటుంబంసవరించు
ప్రతాపరెడ్డి భార్య చరిత, ఈమె సాధారణ గృహిణి. అన్న కృష్ణారెడ్డి, వదిన అరుంధతి గ్రామ సర్పంచులుగా పనిచేశారు.