జాతీయ విద్యా దినోత్సవం

జీవిత చరిత్ర

జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 11న నిర్వహించబడుతుంది. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[1][2][3]

Maulana Abul Kalam Azad.jpg
మౌలానా అబుల్ కలాం ఆజాద్

ప్రారంభం మార్చు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కార్యక్రమాలు మార్చు

  1. దేశంలోని అన్ని విద్యాసంస్థలు విద్యపై సదస్సులు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు, శిక్షణా శిబిరాలు నిర్వహించబడుతాయి.
  2. అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత, విద్యారంగంపై ఉన్న నిబద్ధతతో గురించి ర్యాలీలు తీస్తూ, నినాదాలు ఇవ్వబడుతాయి.

మూలాలు మార్చు

  1. "Maulana Abul Kalam Azad remembered on National Education Day". The Indian Express. 12 November 2008. Retrieved 11 November 2019.
  2. "National Education Day celebrated". The Hindu. 14 November 2011. Retrieved 11 November 2019.
  3. "Maulana Azad's birthday to be celebrated as National Education Day by Govt. of A.P." Siasat Daily. 7 November 2013. Retrieved 11 November 2019.