జాన్ ఆడమ్స్ (అమెరికా అధ్యక్షుడు)

అమెరికా సంయుక్త రాష్ట్రాల రెండవ అధ్యక్షుడు

జాన్ ఆడమ్స్ (ఆంగ్లం: John Adams) (అక్టోబరు 30 [O.S. అక్టోబరు 19] 1735 – జులై 4, 1826) అమెరికాకు చెందిన రాజనీతివేత్త, ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త, అమెరికా వ్యవస్థాపక పితృలుగా పిలువబడే ఐదుగురిలో ఒకరు. ఆడమ్స్ అమెరికా రెండవ దేశాధ్యక్షులుగా (1797–1801) పనిచేసారు. మొట్టమొదటి దేశ ఉపాధ్యక్షుడిగా (1789–97) వరకు పనిచేసారు. బ్రిటన్ నుండి అమెరికా విముక్తి కొరకు చేసిన ఉద్యమ నాయకుడిగా వ్యవహరించారు. అమెరికా ఉద్యమ సమయంలో సన సోదరుడైన సామ్యూల్ ఆడమ్స్ తో కలిసి పనిచేశాడు. "బోస్టన్ మారణకాండ"కు సంబంధించి బ్రిటిషు దళాలకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించాడు.

జాన్ ఆడమ్స్
జాన్ ఆడమ్స్ (అమెరికా అధ్యక్షుడు)

John Adams by John Trumbull, c. 1792


ఉపరాష్ట్రపతి Thomas Jefferson

అధ్యక్షుడు George Washington






వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ Federalist
జీవిత భాగస్వామి
(m. 1764; died 1818)
సంతానం Abigail, John Quincy, Susanna, Charles, Thomas, and Elizabeth
పూర్వ విద్యార్థి Harvard College
సంతకం జాన్ ఆడమ్స్ (అమెరికా అధ్యక్షుడు)'s signature

"అమెరికా స్వాతంత్ర్యపకటన" పత్రాన్ని రచించుటలో జెఫర్సన్కు, జాన్ ఆడమ్స్ తన సహకారాన్ని అందించాడు. అమెరికా స్వాతంత్ర్యం తరువాత బ్రిటన్ తో శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. మసాచుసెట్స్ రాష్ట్రానికి రాజ్యాంగాన్ని రచించారు. అమెరికా దేశ 6వ అధ్యక్షుడైన "జాన్ క్విన్సీ ఆడమ్స్"కు జాన్ ఆడమ్స్ స్వయానా తండ్రి. జాన్ ఆడమ్స్ "అమెరికా స్వాతంత్ర్య ప్రకటన" రచించి 50 యేళ్ళు పూర్తయిన రోజున మరణించారు జూలై 4 1826. సరిగ్గా అదే రోజు దాన్ని రచించిన ప్రముఖ వ్యక్తి థామస్ జెఫర్సన్ కూడా మరణించారు.

Notes మార్చు