జీవని సంస్థ అనంతపురం నుండి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి మెరుగయిన విద్య అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

అనాధశ్రమం - ప్రతీకాత్మక చిత్రం

స్థాపన మార్చు

జూన్ 2009లో ఎస్వీ ప్రసాద్ అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి ద్వారా ఇది నెలకొల్పబడింది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ప్రాథమికంగా ఈ సంస్థ ఏర్పాటులో చేయూతనిచ్చారు.

లక్ష్యం మార్చు

అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారికి ఆశ్రయం కల్పించి నాణ్యమయిన విద్యను అందించడంతోపా టుగా ఇంటి వద్ద ఉండే కుటుంబం లాంటి పరిసరాలను అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

ప్రస్తుత గణాంకాలు మార్చు

ప్రస్తుతం జీవని సంస్థలో దాదాపుగా 50 మంది పిల్లలు ఉన్నారు. హాస్టల్ ప్రాంగణంలోనే 2013 మొదలు ప్రాథమిక విద్యాలయం కూడా ఉంది. ఇక్కడ ఇతర విద్యార్థులకూ, జీవని విద్యార్థులకు కలిపి పాఠాలు చెబుతారు.

వనరులు మార్చు

సంస్థను నడిపేందుకు కావాల్సిన వనరులు చాలా వరకూ ఎసారైటీ యాజమాన్యం సమకూర్చుతుంది. ఇతర ఖర్చుల కోసం తెలుగు బ్లాగరులు, అంతర్జాలంలో జీవని జాలగూడు, బ్లాగు చూసిన వ్యక్తులు సహాయం చేస్తూ ఉంటారు.

హాస్టల్ ప్రాంగణం మార్చు

అనంతపురం నుండి తాడిపత్రి వెళ్ళే మార్గంలో బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో హాస్టల్ ఉంది. ఇది 2012లో ప్రారంభమయింది. ఈ ప్రాంగణం లేక ముందు పిల్లలు ప్రయివేట్ హాస్టల్ లో ఉండేవారు. హాస్టళ్ళు, తరగతి గదులు, వంటగది, ఆట స్థలం, మొదలగునవి ఈ ప్రాంగణంలో ఉన్నాయి.

బయటి లంకెలు మార్చు

జీవని జాలగూడు