టిబెట్ లో 15 నెలలు

గొప్ప పండితులు, బహుగ్రంథకర్త, పత్రికారచయిత, బహుభాషాకోవిదులు, భోజ్ పురి నాటకకర్త, విశ్వయాత్రికులు రాహుల్ సాంకృత్యాయన్ 1929-30 ప్రాంతంలో టిబెట్ ముఖ్యపట్టణం ల్హాసాలో 15నెలలు ఉన్నారు. ఈ దుర్గమమైన మార్గంలో చేసిన యాత్రను, టీబెట్ ప్రజల జీవనవిధానాన్ని వారు హిందీలో పుస్తక రూపంలో తెచ్చి ఎంతోకాలమైంది.

విదుషి, బహుగ్రంథ రచయిత్రి, శ్రీమతి పారనంది నిర్మల చాలా సమర్ధవంతంగా ఈ యాత్రాచరిత్రను తెలుగు చేయగా, విశాలాంధ్ర ప్రచురించింది. ఈ పుస్తకం చదవడం గొప్ప అనుభవం. ప్రాచీన కాలంలో జ్ఞానతృష్ణతో యాత్రలు చేసిన మహనీయుల మాదిరే సాంకృత్యాయన్ తిరుగు ప్రయాణంలో అపూర్వమైన టీబెట్ రాతప్రతులను కంచర గాడిదలమీద వేసుకొని భారతదేశం చేరారు. ఏ రాజాశ్రయం లేకుండా, ప్రకృతి వనరులు లేకుండానే అంత అతిశీతల భూమిలో నివసించిన బౌద్ధ భిక్షువులు వందలాది సంస్కృత రచనలను, బౌద్ధ తత్వ గ్రంథాలను భోటియా భాషలోకి అనువాదం చేసుకొని, మఠాలలో గ్రంథసంపదను కాపాడుకొన్నారు. అటువంటి పండితులే సాంకృత్యాయన్ గారు కూడా.

మూలాలు మార్చు

  • టిబెట్ లో 15 నెలలు, విశాలాంధ్ర ప్రచురణ, 2017.