తిరువల్లిక్కేణి

తిరువల్లిక్కేణి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువల్లిక్కేణి
ప్రదేశం
దేశం:భారత దేశము

వివరాలు మార్చు

బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. కైరవీణీ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఆనన్దవిమానము-అత్రిమహామునికి తిరువారాధనము-అర్జునునకు ప్రత్యక్షము

అచటనే మన్నాధర్. (ఎన్నెయాళుడై యప్పన్;రంగనాథులు) వేదవల్లిత్తాయార్-తూర్పుముఖము-భుజంగశయనము-భృగుమహర్షిచే కన్యాదానము పొందినారు. తెళ్ళి అழకియసింగర్ (నరసింహస్వామి) -పశ్చిమ ముఖము-కూర్చున్నసేవ-జాబాలికి అత్రిమహర్షికి ప్రత్యక్షము.

చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు దక్షిణముఖము-శశపదుని కుమారుడగు మధుమానునకు ప్రత్యక్షము.

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం

తేవప్పెరుమాళ్ (గజేంద్రవరదన్) -తూర్పుముఖము-గరుడా రూడులు-శేష విమానము-ఇంద్ర అగ్ని సోమ మీన-విష్ణుతీర్థములు. వీనిచే చుట్టబడిన కై రవిణీ సరస్సు. ఆకై రవిణీ తీరమున పార్థసారథి రంగనాథ నరసింహ శ్రీరామచంద్ర గజేంద్రవరదులుగా వేంచేసియున్నారు. మార్కండేయ, అత్రి, సుమతి, మరీచి, భృగు, జాబాలి, సర్పరోములకు ప్రత్యక్షము. పేయాళ్వార్-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించింది. ఈ తిరువల్లిక్కేణిలో స్వామి పంచమూర్తులుగా వేంచేసియున్నారు.

విశేషాలు మార్చు

తమిళములో కలువపువ్వును "అల్లి" అంటారు. కలువపూవులు మెండు గాగల పుష్కరిణి యగుటచే "తిరు అల్లిక్కేణి" అని ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రము మైలాపూరునకు సమీపమునందుండుటచే మయిలై తిరువల్లిక్కేణి యనియు తిరునామము గలదు. బృందారణ్యక్షేత్రమనియు పేరు ఉంది. తొండమాన్ చక్రవర్తి ప్రార్థనచే తిరుమలై తిరువేంగడముడైయాన్ (శ్రీనివాసుడు) కృష్ణావతారముగా సకుటుంబముగా సేవ సేయించిన ప్రదేశము. కావున స్వామి వేంకటేశ్వరుని తిరునామముతో "వేంకటకృష్ణన్" అను తిరునామమేర్పడినది. ఈ దివ్యదేశమున స్వామి రుక్మిణీదేవితోను, బలరాముడు సాత్యకి (సోదరులు) ప్రద్యుమ్నుడు (కుమారుడు) అనిరుద్దుడు (మనుమడు) వీరితో కలసి సకుటుంబముగా సేవ సాయించును. ఇట్టి సన్నివేశమును మరియొకచోట దర్శింపలేము. అట్లే శ్రీరంగనాథులు (శయనించిన) చక్రవర్తి తిరుమగన్ (నిలచున్న) గజేంద్రవరదన్ (పయనించుచున్న) అழగియశింగర్ (కూర్చున్న) విధము సేవింపదగినది. (ఒకే దివ్యదేశమున నిన్ఱ, ఇరున్ద, కిడన్ద, నడన్ద తిరుక్కోలములు).

ఇచటనే ఆసూరి కేశవాచార్యులవారు పుత్రకామేష్ఠి చేసి "భగవద్రామానుజులను" పుత్రులుగా పొందిరి.

సాహిత్యం మార్చు

శ్లో. శ్రీ మత్కై రవిణీ సరోవర లసత్ బృందావనాఖ్యాయుతే
   వల్లిక్కేణి పురే స్థిత స్సుర దిశా పక్త్రాంబుజో రాజతే|
   రుక్మిణ్యా త్వవిరుద్ద సాత్య బల ప్రద్యుమ్న సేవ్యో త్రిణా
   సంపూజ్యో భువి పార్దసారధి విభు: పార్దాక్షి యుగ్మా తిధి:||
   
   తత్తైవ రంగనాథఖ్యో వేదవల్ల్యా ఫణీంద్రగ:|
   భృగుణా కన్యకాదానం ప్రాపిత స్సుర దిజ్ముఖ||
   తత్తైవ నరసింహాఖ్య: పశ్చిమాభిముఖానస:
   జాబాల్యత్రి మునీంద్రాభ్యాం సేవితో మోక్షదస్తయో::||

   సీతాలక్ష్మణ శత్రుఘ్న భరతై స్తత్ర రాఘవ:
   దక్షిణాభి ముఖస్తిష్ఠన్ మధుముమ్మవి వీక్షిత:||
   గజేంద్ర వరద స్తత్ర సప్తరోమ మునీక్షిత:|
   ప్రాజ్ముఖో గరుడా రూడ శ్శేషాహ్వయ విమానగ:||

   ఇంద్రాగ్ని సోమ మీనాఖ్య విష్ణు తీర్థాతి సుందరే
   శ్రీ మత్కైరవిణీ తీరే రాజంతే పంచమూర్తయ:||
   మార్కండేయాత్రి సుమతి మరీచి భృగు యోగిన:|
   జాబాలి సర్ప రోమణౌ తేపురత్ర పరం తప:||

   పరకాల మహాయోగి భక్తిసార పరిస్తుత:|
   తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే ||

పాశురాలు మార్చు

పా. విఱ్పెరు విழవుమ్‌ క-నుమ్‌ మల్లుమ్;వేழముమ్‌ పాగనుమ్‌ వీழ;
   శెత్తవన్ న్ఱన్నై పురమెరిశెయ్‌ద; శివనుఱుతుయర్ కళై తేవై;
   పత్‌తలర్ వీయక్కోల్ కైయిల్ కొణ్డు; పార్తన్ఱన్ తేర్‌మున్ నిన్ఱానై
   శిత్‌తవై పణియాల్ ముడితుఱన్దానై; త్తిరివల్లిక్కేణి క్కణ్డేనే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-3-1

చేరే మార్గం మార్చు

మద్రాసులోని తిరువల్లిక్కేణి.

వెలుపలి లింకులు మార్చు