తెలుగునాడు (చలనచిత్రం)

తెలుగునాడు 1982 అక్టోబరు 23న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వీరకాకాని పిక్చర్స్ పతాకం కింద బి.నారాయణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు పి.లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, ప్రసాద్ బాబు, కె.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు. [1]

తెలుగునాడు
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శరత్‌బాబు ,
ప్రసాద్ బాబు ,
కె.విజయ
సంగీతం వి.శంకర్
నిర్మాణ సంస్థ శ్రీ వీర కాకాని పిక్చర్స్
భాష తెలుగు

రజాకార్ల దౌర్జన్యాలు, ఆంధ్ర తెలంగాణా ఉద్యమాలు మొదలైన వాటితో ఆంధ్ర దేశాం ఎలా అల్ల కల్లోలమైందన్నదీ అత్యంత చక్కగా వివరించిన చిత్రం. ఇందులో కథను కూడా ఈ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకునే అల్లారు. ఒక ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉంటారు. వాళ్ళు విడిపోదాం, విడిపోదాం అని కోరుకుంటారు. (ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ) "అనైక్యత", "సమైక్యత" కోరుకునే వారి మధ్య సంఘర్షణ అయితే క్లైమాక్స్ లో కలసి ఉంటేనే కలదు సుఖం అని నిరూపించిన చిత్రం "తెలుగు నాడు. ఈ చిత్రం పాటల్లో కొసరాజు రాసిన

ఒకరు కలసి ఉండాలంటారు
ఒకరు వేరు పడాదామంటారు
ఏమిటయ్యా ఈ వేదాంతం
తెలుగు వాళ్ళ ఈ రాద్ధాంతం

అనే పాటను చక్కని అర్థవంతంగా ఉన్న పాటి అని చెప్పవచ్చు. చిత్రం పూర్తయిన తరువాత కోర్టు తీర్పుతో విడుదలైంది.

స్వర్గీయ రమణారెడ్డి నటించిన ఆఖరి చిత్రం ఇది. దర్శాకుడు దీపక్ చాలా ప్రయాసలు పడి ఉద్యమ దౌర్జన్యాలను వాస్తవంగా చిత్రీకరించడం సాహసోపేతమైన విషయమ్

తారాగణం మార్చు

  • శరత్ బాబు
  • ప్రసాద్ బాబు
  • కె.విజయ
  • రమణారెడ్డి
  • రవికాంత్
  • భవాని
  • సుశీల

మూలాలు మార్చు

  1. "Telugunaadu (1982)". Indiancine.ma. Retrieved 2023-05-31.

బాహ్య లంకెలు మార్చు