దూద్ సాగర్ జలపాతం

దూద్ సాగర్ జలపాతం భారత రాష్ట్రమైన గోవాలో కర్నాటక రాష్ట్ర సరిహద్దుగా మన్‌డోవి నదిపై ఉంది. దీనిని పాల సాగర జలపాతం అని కూడా అంటారు. జలపాతంలోని నీరు నురగలతో పాలను తలపించునట్లుగా ఉండుట వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఇది నాలుగు అంచెలుగా ఉంటుంది.

దూద్ సాగర్ జలపాతం
दूधसागर जलप्रपात ದೂಧ್‍ಸಾಗರ್ ಜಲಪಾತ
మార్చి 2010 లో దూద్సాగర్ జలపాతం
ప్రదేశంగోవా, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు15°18′46″N 74°18′51″E / 15.31277°N 74.31416°E / 15.31277; 74.31416
రకంశ్రేణులుగా
మొత్తం ఎత్తు310 మీటర్లు (1017 అడుగులు)
బిందువుల సంఖ్య4
నీటి ప్రవాహంమన్‌డోవి నది

ఇది రోడ్డు మార్గం ద్వారా పనాజి నగరం నుండి 60 కిలోమీటర్ల దూరంలో, రైలు మార్గం ద్వారా మడ్గావన్ రైల్వే స్టేషను నుండి 46 కిలోమీటర్ల దూరంలో, బెల్గాం నుండి రైలు మార్గం ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో, రోడ్డు మార్గం ద్వారా 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.