ధర్మోత్తర (టిబెటియన్: chos mchog) క్రీ. శ. 8 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ పండితుడు. తత్వవేత్త. వ్యాఖ్యాత.[1] తార్కికుడైన ఇతను జ్ఞానమీమాంసకు (epistemology) సంబంధించిన బౌద్ధ ప్రమాణాలపై ముఖ్యమైన గ్రంథాలను రాసాడు.

రచనలు మార్చు

బౌద్ధ ప్రమాణాలపై ప్రామాణిక గ్రంథాలను రాసిన ధర్మోత్తర, ఆచార్య ధర్మకీర్తి రచనలపై అనేక వ్యాఖ్యానాలు రాసాడు. అయితే అతని గ్రంథాలలో న్యాయబిందుటీకా ఒక్కటి మాత్రమే సంస్కృత భాషలో లభించింది. మిగిలిన గ్రంథాలన్నీ టిబెటియన్ అనువాదాలుగానే దొరుకుతున్నాయి.[2][3] ఇతని రచనలు

  • అపోహనామప్రకరణం
  • క్షణభంగసిద్ధి
  • పరలోకసిద్ధి
  • ప్రమాణ పరీక్ష
  • ప్రమాణవినిశ్చయటీకా
  • న్యాయబిందుటీకా

వీటిలో న్యాయబిందుటీకా అనేది, బౌద్ధ న్యాయంపై ఆచార్య ధర్మకీర్తి రాసిన 'న్యాయబిందు' (Drop of Logic) అనే ప్రసిద్ధ గ్రంథానికి రాయబడిన వ్యాఖ్య. అలాగే ప్రమాణవినిశ్చయటీకా అనేది, ధర్మకీర్తి మరో కృతి అయిన 'ప్రమాణనిశ్చయ'కు రాయబడిన వ్యాఖ్య.

మూలాలు మార్చు

  1. "Indian philosophy". britannica.com. Encyclopedia Britannica. Retrieved 4 October 2017.
  2. Lal Mani Joshi, Studies in the Buddhistic Culture of India During the 7th and 8th Centuries A.D., page 165.
  3. "Dharmottara (740-800)". Epistemology and Argumentation in South Asia and Tibet. Archived from the original on 19 జూన్ 2015. Retrieved 18 January 2016.