నయన్‌మోని సైకియా

నయన్‌మోని సైకియా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మహిళా లాన్‌ బౌల్స్‌ క్రీడాకారిణి. ఆమె 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లాన్‌బౌల్స్‌లో భారత మహిళల జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి, స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.[1][2] ఆమె ప్రస్తుతం అస్సాం ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.

నయన్‌మోని సైకియా
2022 ఆగస్టు లో నయన్‌మోని సైకియా

క్రీడా జీవితం మార్చు

నయన్‌మోని సైకియా వెయిట్ లిఫ్టర్ అయినప్పటికీ గాయం తర్వాత లాన్ బౌల్స్ తీసుకుంది. ఆమె 2008లో గౌహతిలో జరిగిన జాతీయ క్రీడల్లో చూసిన తర్వాత ఆమె క్రీడలోకి అడుగుపెట్టి 2011 నేషనల్ గేమ్స్‌లో, ఆమె రెండు బంగారు పతకాలను గెలుచుకుంది. నయన్‌మోని 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జట్టులో భాగ్యస్వామై మహిళల సింగిల్స్, ట్రిపుల్స్ ఈవెంట్‌లలో పాల్గొంది.

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (3 August 2022). "బంతులాటలో బంగారం". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  2. Sakshi (3 August 2022). "ఊహించని ఫలితం.. 'ఆనందం నాలుగింతలు'". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.