నానా రాజన్య చరిత్రము

బ్రిటీష్ ఇండియాలో ప్రిన్స్‌లీ స్టేట్స్ (Princely states) గా పిలుచుకునే రాజ్యాల పాలకుల (ప్రముఖంగా తెలుగు వారు) గురించీ, వారి వంశక్రమణిక గురించీ వ్రాసిన పుస్తకమిది. వేంకటగిరి, ముత్యాలపాటి, వాసిరెడ్డి వంటి 10 సంస్థానాల వివరాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఆనాటి సాంఘిక, రాజకీయ స్థితిగరులు ఈ పుస్తకంలో అంతర్లీనంగా కనిపిస్తూంటుంది.

దీనిని మచిలీపట్నంలోని నోబిల్ కాలేజీ ఆంధ్రోపాధ్యాయులైన శ్రీరామ వీరబ్రహ్మము (Sreeram Veerabrahmam) రచించగా 1918లో ముద్రించారు. దీని గుంటూరు జిల్లా డిప్యూటీ కలక్టరు చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాద్ పీఠికను అందించారు.

పేర్కొన్న రాజవంశములు మార్చు

  • కొచ్చెర్లకోటవారి సంస్థానము
  • చా మహల్ సంస్థానము
  • దేవరకోట సంస్థానము
  • నూజివీడు సంస్థానము
    • ఉయ్యూరు
    • కపిలేశ్వరపురము
    • తేలప్రోలు
    • మీర్జాపురము
    • మేడూరు
  • బొమ్మదేవరవారి సంస్థానము
    • దక్షిణ వల్లూరు
  • మైలవర సంస్థానము
  • ముత్యాలపాటి సంస్థానము
  • మునగాల సంస్థానము
  • మంత్రిప్రెగడవారి సంస్థానము
  • మందసా సంస్థానము
  • వత్సవాయ సంస్థానము
  • వాసిరెడ్డి సంస్థానము
  • విస్సన్నపేట సంస్థానము
  • వేంకటగిరి సంస్థానము

బయటి లింకులు మార్చు