నైనాల జయసూర్య

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు

నైనాల జయసూర్య భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

నైనాల జయసూర్య

పదవీ కాలం
13 జనవరి 2020 – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 27 ఆగష్టు 1968
తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు ఎన్‌వీవీ కృష్ణారావు, ఇందిరా దేవి
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

నైనాల జయసూర్య 1968 ఆగస్టు 27లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో ఎన్‌వీవీ కృష్ణారావు, ఇందిరా దేవి దంపతులకు జన్మించాడు. ఆయన తణుకులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పదవ తరగతి వరకు, రాజమండ్రి ఏకేసీ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్, ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ, విజయవాడలోని వెలగపూడి దుర్గాబాయి సిద్ధార్థ కాలేజీ ఆఫ్‌ లాలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1992లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం మార్చు

నైనాల జయసూర్య ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) తలారి అనంతబాబు వద్ద జూనియర్‌గా చేరి 2003 నుండి 2004 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా, 2009 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ, సహకార శాఖకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. జయసూర్య హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ, ఏపీఎస్టీసీ, భారత ఎస్టీసీ ప్రభుత్వ రంగ సంస్థల తరఫున కేసులు వాదించాడు. ఆయన 2018 నుండి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్‌ ఎలెక్షన్‌ అథారిటీకి స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, బీహెచ్‌ఈఎల్‌, ఆప్కో, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ప్యానల్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టులకు ప్యానెల్‌ న్యాయవాదిగా ఉన్న ఆయన 2020 జనవరి 11లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2020 జనవరి 13న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. The New Indian Express (12 January 2020). "Andhra Pradesh High Court gets four new judges". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  2. Andrajyothy (11 January 2020). "హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.
  3. Sakshi (11 January 2020). "హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు". Archived from the original on 23 October 2021. Retrieved 23 October 2021.