భారత పార్లమెంట్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భారత పార్లమెంట్ (Parliament of India) (లేదా సంసద్), భారత ఫెడరల్ ప్రభుత్వ అత్యున్నత విధాన అంగం. ఇందులో రెండు సభలు ఉన్నాయి, ఒకటి లోకసభ రెండవది రాజ్యసభ. ఇది భారత రాజధాని ఢిల్లీ లోని సంసద్ మార్గ్లో గలదు.
భారత పార్లమెంటు | |
---|---|
![]() | |
రకం | |
రకం | ద్వి సభ |
సభలు | రాజ్యసభ లోక్ సభ |
నాయకత్వం | |
ద్రౌపది ముర్ము 2022 జూలై 25 నుండి | |
వెంకయ్యనాయుడు, స్వతంత్ర అభ్యర్థి 2017 ఆగస్టు 11 నుండి | |
మెజారిటీ నాయకుడు (లోక్ సభ) | |
మెజారిటీ నాయకుడు (రాజ్యసభ) | |
నిర్మాణం | |
సీట్లు | 788 (245 రాజ్యసభ + 543 లోక్ సభ) |
![]() | |
లోక్ సభ రాజకీయ వర్గాలు | అధికారిక: ఎన్ డి ఎ ప్రతిపక్షాలు: యూపీఎ, మూడవ ఫ్రంట్, ఇతరులు |
![]() | |
రాజ్య సభ రాజకీయ వర్గాలు | యూపీఎ (మెజారిటీ), ఎన్ డి ఎ (రెండవ), ఇతరులు : మూడవ ఫ్రంట్ |
ఎన్నికలు | |
లోక్ సభ చివరి ఎన్నికలు | 16 January, 23 March and 21 June 2018 |
రాజ్య సభ చివరి ఎన్నికలు | 11 April – 19 May 2019 |
లోక్ సభ next election | May and June 2019 |
రాజ్య సభ next election | May 2024 |
సమావేశ స్థలం | |
![]() | |
సంసద్ భవన్ | |
వెబ్సైటు | |
parliamentofindia.nic.in |
పేరు పుట్టు పూర్వోత్తరాలుసవరించు
సంసద్ అనే పదము సంస్కృతానికి చెందింది, అర్థం ఇల్లు లేక భవనం.
పార్లమెంట్ భవనం (సంసద్ భవన్)సవరించు
పార్లమెంటు భవనం (సంసద్ భవన్), ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో గలవు, రాష్ట్రపతి భవన్కు అందుకున్నంత దగ్గరలో గలవు.
లోక్ సభసవరించు
లోక్ సభ ను, ప్రజాసభ లేదా దిగువసభ అని అంటారు. దీనిలోని సభ్యులంతా దాదాపు ప్రజలచేత ఎన్నుకోబడినవారే. ఇది అత్యంత శక్తివంతమైన సభ, కొన్ని సార్లు రాజ్యసభ నిర్ణయాలను సైతం తోసిరాజంటుంది.
ఈ సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత రాష్ట్రపతి తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది సభ్యులున్నారు. 530 మంది రాష్ట్రాలనుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కలరు.
రాజ్యసభసవరించు
రాజ్యసభను "రాజ్యాంగ పరిషత్తు" అని లేదా "ఎగువ సభ" అని కూడా అంటారు. దీని సభ్యులు భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలచే ఎన్నుకోబడతారు. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
రాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడూ 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు. ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 80 లో వివరింపబడింది.
- 12 మంది సభ్యులు భారత రాష్ట్రపతి చే నామినేట్ చేయబడతారు. వీరు సాహిత్య, శాస్త్రీయ, కళా, సాహిత్య రంగాల నుండి ప్రతిపాదించబడతారు.
- రాష్ట్రాలలోని శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
- కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు, ఎలెక్టోరల్ కాలేజి ద్వారా ఎన్నుకోబడుతారు.
రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ నుండి 31 సభ్యులుంటే, నాగాలాండ్ నుండి కేవలం ఒక్కరే. ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు. అందరూ నిజాయితీగా ఉండవలసిన భవనం.