పాలమూరు జిల్లా యక్షగాన సాహిత్యం

తెలుగు సాహిత్యంలో యక్షగానం అనేది గాన , నృత్య ప్రధానమైన జానపద కళారూపం. మధుర కవితాశాఖకు చెందిన ఈ యక్షగానం గేయ ప్రధానమైనది. పాలమూరు జిల్లాలో మొట్టమొదటి యాక్షగానం అప్పకవి రాసిన అంబికాసంవాదం. ఆ తర్వాత ఎందరో కవి పండితులు వందలకొద్ది యక్షగానాలను రచించారు. దేశీ కవితాశాఖలో యక్షగానం ప్రక్రియ బహుళ ప్రజాదరణ పొందింది.[1]

గోవర్ధనం వెంకట నర్సింహాచార్యులు మార్చు

జడ్చర్లకు చెందిన గోవర్ధనం వెంకటనర్సింహాచార్యులు 'అజామిళోపాఖ్యానం' , 'గొల్లకలాపం' అనే యక్షగానాలను రచించాడు.

కొండపల్లి పాపయ్య మార్చు

దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామానికి చెందిన కొండపల్లి పాపయ్య 'మార్కండేయ విలాసం' అనే యక్షగానాన్ని రాశాడు.

ప్రబంధం హనుమద్దాసు మార్చు

ఇతడు ప్రసిద్ధ సంకీర్తనాచార్యుడు మన్నెంకొండ హనుమద్దాసు మేనత్త కొడుకు. 'విజయవిలాసం' అనే యక్షగానాన్ని రచించాడు. ఇది దాదాపు రెండువందల సార్లకు పైగా ప్రదర్శించబడింది. ఈయన సంకీర్తనలు కూడా రాశాడు.

బెల్లం నాగప్ప మార్చు

నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన బెల్లం నాగప్ప దాదాపు 32 యక్షగానాలను రచించాడు. కిరాతార్జునీయం, రంభావిలాసం, రామాంజనేయ యుద్ధం, యయాతి చరిత్ర, ఉషాపరిణయం, బాణాసుర యుద్ధం, తారాశశాంకం వంటి యక్షగానాలను రచించాడు.

మూలాలు మార్చు

  1. మహబూబ్ నగర్ జిల్లా సాహిత్య చరిత్ర, డా. భీం పల్లి శ్రీకాంత్. తెలంగాణ సాహిత్య అకాడమీ.