పిడుపర్తి బసవకవి

కవి కాలాదులు మార్చు

పిడుపర్తి బసవకవి శైవబ్రాహ్మణుడు. బసవపురాణమును పద్య కావ్యముగా రచియించిన సోమనాధుని తమ్ముడయిన పాలనార్యుని పుత్రుడు. కాబట్టి యీకవియు నించుమించుగా సోమనాధుని కాలమునందే యున్నవా డగుటచేత 1520 -వ సంవత్సర ప్రాంతమునం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు పాల్కురికి సోమనాథుడు రచియించిన ప్రభు లింగలీలను తెనుగున నైదాశ్వాసముల పద్యకావ్యముగా రచించెను. ఈ బ్రభు లింగలీలయందు బసవేశ్వరునికిని బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్న బసవన్నకును గురువయిన యల్లమప్రభుడను జంగమదేవరయొక్క కథ చెప్పబడియున్నది.

బసవకవియొక్క కవనవిధము మార్చు

పిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యములు [ 96 ] ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]

ఉ. చిత్తసరోజ మిష్టమున జేరిచి చూపులు ప్రాణలింగమున్ హత్తగ జేసి భావమున కంచితతృప్తి యొసంగి సంగముల్ రిత్తలు చేసి యెందును జరింపగ నేరిచి తేని నీవ య త్యుత్తమలింగమూర్తి వివి యొప్పుగ జేకొను సిద్ధరామనా. [ఆ.3]

మ. బసవయ్యా భవదీయమందిరమునన్ భక్తిన్ సదాభోజనం బసలారంగ నొనర్చుజంగమము లాత్యాసక్తి నాకటించే విసునంగా నికనేల తామసము ఠీవిన్ వారి దోడ్తెచ్చి మీ రసమానస్థితి నారగింప గదరయ్యా హాయిగా నేటికిన్. [ఆ.5]

మూలాల జాబితా మార్చు

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు. [పిడుపర్తి బసవకవి]