పూడూరు కృష్ణయామాత్యుడు

"పూడూరు కృష్ణయామాత్యుడు" ఇతను 17 వ శతాబ్ది పూర్వార్థానికి చెందిన కవి. గద్వాల సమీపంలోని పూడూరు గ్రామవాసి. ఇతని తండ్రి కొండయామాత్యుడు. కాండిన్యస గోత్రులు. ఈ కవి తన గురువు యోగానందుడని చెప్పుకున్నాడు. ఈ యోగానందుడే కృష్ణయామాత్యునికి వాసుదేవద్వాదశాక్షరీమంత్రబీజాన్ని ఉపదేశించాడు[1]. కౌసలేయ చరిత్రమును రాసిన లయగ్రాహి గరుడాచల కవి కి ఇతను సమకాలికుడు. కృష్ణయామాత్యుడు ' భగవద్గీతార్థ దర్పణం ' అను గ్రంథాన్ని రచించాడు. 17 అధ్యాయములు కలిగిన ఈ తాళ పత్ర గ్రంథం 62 కమ్మలతో రాయబడి ఉన్నది[2].

మూలాలు మార్చు

  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన:ఆరుద్ర,ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట - 53
  2. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-68