స్వర్గారోహణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Billinghurst (చర్చ | రచనలు) చి File renamed: File:Mahabharata06ramauoft 1188.jpg → File:Angel showing hell to Yudhisthira.jpg descriptive name |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{మహాభారతం పర్వాలు}}
మహాభారత
=== స్వర్గములో సుయోధనుడిని చూసి ధర్మరాజు కలత చెందుట ===
'''వైశంపాయనుడు''' " తన బంధువులను చూడవలెనని పట్టుబట్టిన [[ధర్మరాజు]] కోరికను [[ఇంద్రుడు]] మన్నించాడు. వెంటనే ఒక దూతను పిలిచి " ఈయన ధర్మరాజు. ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నీవు ఈయనను తీసుకు వెళ్ళి ఆయన బంధువులను అందరినీ చూపించు. ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు. ధర్మరాజు వెంట [[నారదుడు]], '''దేవఋషులు''' కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనము మీద కూర్చున్న [[దుర్యోధనుడు|సుయోధనుడు]] కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో " దేవమునులారా ! ఈ సుయోధనుడు పరమ లోభి. ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధముకు పిలిపించి వారి రధ, గజ, తురంగ, కాల్బలములతో సహా మరణించేలా చేసాడు. రాజసూయ యాగము చేసి పవిత్రురాలైన [[ద్రౌపది]]ని నిండు కొలువుకు ఈడ్చుకు వచ్చి ఘోరముగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తునాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా ! వీలులేదు నన్ను నా తమ్ములు భీమార్జున నకుల సహదేవులు ఉన్నచోటికి తీసుకు వెళ్ళండి " అని వెనకకు తిరిగాడు.
పంక్తి 26:
=== వైశంపాయనుడు చెప్పిన దేవ రహస్యము ===
స్వర్గముములో కురుక్షేత్ర సమరములో మరణించిన రాజులను చూపించిన విషయము విన్న '''జనమేజయుడు''' వైంపాయనుడిని " మునివర్యా ! తమరు అందరి విషయములు చెప్పారు. వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు. వీరందరూ ఎంత కాలము స్వర్గములో ఉంటారు ? శాశ్వతముగా స్వర్గములోనే ఉండిపోతారా ! లేక కొంతకాలము మాత్రము ఉండి తరువాత మానవజన్మ ఎత్తుతారా ! వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! అది దేవరహస్యము. దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు. అది మీకు చెప్తాను. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిసాడు. ధృతరాష్ట్రుడు, గాంధారీ కుబేరలోకములోకి చేరారు. పాండురాజు కుంతీ, మాద్రిలతో కలసి స్వర్గములో ఉన్నాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలసి పోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలసి పోయాడు. [[శకుని]] ద్వాపరుడిలో కలసి పోయాడు. సుయోధనుడు కొంత కాలము స్వర్గములో స్వర్గ సుఖములు అనుభవించిన తరువాత నరకలోకములో తాను చెసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలసిపోయాడు. మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గసుఖములు, పాపకార్యములకు తగినంత నరకయాతనలు అనుభవించి తరువాత రాక్షస గణములలో ఐక్యము అయ్యారు. [[కర్ణుడు]] తన తండ్రి అయిన సూర్యుడిలో కలసి పోయాడు. [[భీష్ముడు]] అష్టవసువులలో చివరి వాడు అయి వసువులలో చేరాడు. [[ద్రుపదుడు]], [[విరాటుడు]], '''ధృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు''' వీరందరూ వీశ్వదేవతలలో కలసి పోయారు. [[ధృష్టద్యుమ్నుడు]] అగ్నిలో కలసి పోయాడు. అప్పటికే [[ధర్మరాజు]] శరీరములో కలసి పోయిన [[విదురుడు]] ధర్మరాజుతో చేరి [[యముడు|యమధర్మరాజు]]తో కలసి పోయాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారము [[బలరాముడు]] అనంతుడిలో కలసి పోయాడు. శ్రీకృష్ణుడితో రాసలీలలు సలిపిన 16 వేల గోపికలు సరస్వతీ నదిలో స్నానము చేసి అప్సరసలుగా మారి [[విష్ణువు|మహావిష్ణువు]]ను సేవిస్తునారు. శ్రీకృష్ణుడితో సహగమనము చేసిన [[రుక్మిణి|రుక్మిణీదేవి]] లక్ష్మీదేవిలో కలసి పోయింది. శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు [[లక్ష్మీ]]దేవిలో కలసి పొయారు. జనమెజయ మహారాజా ! మహాభారత యుద్ధములో చనిపొయిన వారు నేను చెప్పిన వారు చెప్పని వారు అందరూ వారి వారి అంశలు అయిన '''దేవతా, రాక్షస, యక్ష, గుహ్యక, గంధర్వ''' బృందములో కలసి పొయారు. జనమెజయ మహారాజా ! కురుపాండవుల విషయములతో కూడిన ఈ భారత
===
'''జనమేజయుడు''' చేసిన సర్పయాగములో వేదవ్యాస మహర్షి ఆదేశానుసారము '''వైశంపాయనుడు''' ఈ
=== ఫలములు ===
ఈ
==బయటి లింకులు==
|