అనుపాలెం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
"అనుపాలెం" గుంటూరు జిల్లా [[రాజుపాలెం]] మండలానికి చెందిన గ్రామం.
ఈ గ్రామానికి చెందిన శ్రీ వీర్ల శ్రీను, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వారు. భార్యాభర్తలిద్దరూ కూలీనాలీ పనిచేసి కుటుంబన్ని పోషించుచున్నారు. వీరు తమ కుమార్తె నాగపద్మను కష్టపడి చదివించుచున్నారు. నాగపద్మను పదవ తరగతి వరకు, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనే చదివించినారు. ఈమె పదవ తరగతిలో మండలంలోనే ప్రధమ స్థానంలో ఉత్తీర్ణురాలయి, ట్రిబుల్ ఐ.టి. నూజివీడులో సీటు సాధించినది. అక్కడే ఇంటరు పరీక్షలు వ్రాసిన ఈమె, 2014,మే-14న అమెరికాలోని "నాసా" అంతరిక్ష పరిశోధనా కేంద్రం వారి అహ్వానం మేరకు అక్కడ ఒక సదస్సుకు హాజరైనది. ఆ సదస్సులో మొత్తం 400 మంది వివిధ దేశాలకు చెందినవారు హాజరైనారు. ఆ సదస్సులో ఈమె, తను రూపొందించిన ఏరోనాటికల్ ప్రాజెక్టులో క్రియేటివ్ అనదర్ వరల్డ్ "నిత్య" అను ప్రాజక్టును వివరించినది. భవిష్యత్తులో భూమి నాశనమైతే, ప్రజలు ఎక్కడ ఉండాలనే దానిపై ప్రత్యామ్నాయం 'స్పేస్' ను తన ప్రాజెక్టులో చూపించినది. ఈ ప్రాజెక్టుకు అక్కడి సీనియర్ సైంటిస్ట్ శ్రీ ఆల్ గ్లోబస్ మెచ్చుకొని అభినందించినారు. ఈ సందర్భంగా నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ఈమెకు ఒక ధృవపత్రం అందజేసినారు. ఈమె ఈ సదస్సుకు హాజరవడానికి ఒక లక్ష రూపాయలను జిల్లా పాలనాధికారి శ్రీ సురేష్ కుమార్, చొరవ తీసుకొని జిల్లా పరిషత్తు సాధారణ నిధులనుండి, జిల్లా పరిషత్తు సి.ఏ.ఓ. శ్రీ సుబ్బారావు తో మంజూరు చేయించినారు. ఇంకా మరికొందరు దాతలు గూడా ఆర్ధిక సహాయం చేసినారు.
|