ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q7881026
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కె. ఉమా రామారావు
| residence =
| other_names =
| image = Umaramarao Dancing 1.jpg
| imagesize = 200px
| caption =
| birth_name = ఉమా మహేశ్వరి
| birth_date = 4 జూలై 1938
| birth_place =[[విశాఖపట్నం]], [[ఆంధ్రప్రదేశ్]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = కూచిపూడి నర్తకి
| occupation =
| title =
పంక్తి 39:
శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు మరియు రచయిత్రి. 1985 లో [[హైదరాబాదు]] లో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ కి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య మరియు రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించినది.
==పుట్టు పూర్వోత్తరాలు==
4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, శ్రీమతి సౌభాగ్యం లకు [[విశాఖపట్టణం]] లో జన్మించినది. సాహిత్యం, సంగీతం మరియు నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య పి.వి.నరసింహా రావు, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై మరియు గురు సి.ఆర్. ఆచార్యల వద్ద [[కూచిపూడి]], [[భరతనాట్యం]] మరియు ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించినది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక మరియు ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
 
తొలినాళ్ళలో సోదరి సుమతి కౌశల్ తో బాటు పలు సంధర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణ లో ప్రదర్శనలు చేసినది. 1953-55 లలో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సాంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.
పంక్తి 51:
ఈ నేపథ్యంతో [[హైదరాబాదు]]కి చెందిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత/నాట్య కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా 1969 నుండి 1988 వరకు భరతనాట్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను బోధించినది. తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నృత్య విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
 
నృత్యకళలో విద్యార్థుల పరిశోధన మరియు ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై 'షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు' (షాహజీ 1684 నుండి 1712 వరకూ [[తంజావూరు]]ని పరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.
 
తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. అలేఖ్య పుంజాల, జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు మరియు పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు