| occupation = తెలుగువన్.కాం అనే వెబ్సైట్ కి ముఖ్య సంపాదకులు
| title =
పంక్తి 36:
}}
'''మల్లిక్''' ప్రముఖ కార్టూనిస్టు. తెలుగు కార్టూన్ ప్రపంచంలో మల్లిక్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు! మల్లిక్ వేసిన కార్టూన్లకు,వ్యంగ్యాస్త్రాలకు నవ్వనివారు ఉండరు. ఆయన వేసిన ప్రతీ వ్యంగ్యాస్త్రం ఆలోచన రేకెత్తించేదిగా ఉంటుంది.అలాగే సమకాలీన విషయాలపై వారు వ్రాసిన వ్యంగ్యకథలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి.మల్లిక్ వివిధ పత్రికలలో వివిధ కార్టూన్లను సృస్టించిన వ్యక్తి. అందులో ఆంధ్రభూమి పాఠకులకు మల్లిక్ సృష్టించిన చిట్టి, టింగు తెలియ కుండా ఉండరు. ఒకానొక సమయంలో ఆంధ్రభూమిని పాఠకులు కేవలం మల్లిక్ కార్టూన్లు చదవడానికే కొనేవారన్నది అక్షరసత్యం.ఐదు వందలకు పైగా చిన్న కథలు వివిధ పత్రికలకు వ్రాసారు. అలాగే యెన్నో ధారావాహికాలు కూడా ప్రచురింపబడ్డాయి. "పరుగో పరుగు”, "జీవితమే ఒక ఢమాల్" కథలు సినిమాలుగా తీయబడి జనాదరణను పొందాయి. అలాగే "మని", సిసింద్రీ" చిత్రాలకు పబ్లిసిటీ డిసైనర్ గా ఛాయాచిత్రాలను అందించారు. ఆల్ ఇండియా రేడియో వారికి ముఫైకి పైగా నాటికలు వ్రాసారు. అందులో "ఇంపోర్టెడ్ కెమేరా" రేడియో శ్రోతకు బాగా తెలిసిందే! ఇంకా యెన్నో టీ.వి ధారావాహికాలకు కథను అందించారు. మచ్చుక్కి -జెమినీ వారికి "[[అమృతం (ధారావాహిక)|అమృతం]]", "ఆంధ్రా అందగాళ్ళు", ఈ టీ.వికి "ఫన్నీస్", "ఆవిడ నా భార్య కాదు". తెలుగు దూరదర్శనిలో "అమృతం" ఒక ట్రేండ్ సెట్టర్.
==బాల్యం==
వరంగల్లు జిల్లా నుండి వెండితెరకు పాటల రచయిత కావాలనుకొని హైదరాబాద్ ఫిలింనగర్ చేరాడు మల్లిక్. అనేక కష్టాలు పడ్డాడు. చివరకు పాటల రచయిత కావాలనుకున్న వాడు సంగీత దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. 'మల్లిక్' ఇప్పటి వరకు 21 తెలుగు టీవీ సీరియళ్లకు స్వరకర్తగా వ్యవహరించారు.
==పల్లె పాటల ప్రభావం==
ఆయన తండ్రి నాటకాలు ఆడేవారు. అమ్మ పల్లెపాటలు పాడేది. ఆ ప్రభావం ఆయనపై ఉంది. ఆ కాలంలో సినిమా లో స్థానం సంపాదించాలంటే డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని అందరూ అంటుంటే ఆ అవకాశం కోసమే డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తదుపరి హైదరబాద్ లో వెళ్లాలని నిర్ణయించుకుని ఎక్కడ ఉండాలో తెలియక ఓయూలో ఎమ్మెస్సీలో చేరారు. ఉండేందుకు వసతి దొరగ్గానే అవకాశాల కోసం ఫిలింనగర్ లో ప్రయత్నించారు. అప్పుడు అర్థమైంది. సినిమా కష్టాలు అంటే ఏంటో..ఎన్నో స్టూడియోల వద్ద గంటల కొద్దీ ఎదురు చూశావారు. కానీ స్టూడియోలలోనికి అనుమతించేవారు కాదు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక్క ఛాన్సూ రాలేదు. ఓయూ హాస్టల్లో ఉంటూనే కొన్నాళ్లకు మిత్రుల సాయంతో 'అల్ట్రామోడల్ ఆంధ్రాబేబీ' ఆల్బమ్కు మూడు పాటలు రాశారు.అది రిలీజ్ కాగానే ఆయనలో నమ్మకం పెరిగింది. మధ్యలో ఓ సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. కానీ అది రిలీజ్ కాలేదు.
==ఆగిన పి.జీ. చదువు==
పంక్తి 47:
==శబ్దాలయాలో అవకాశం==
రోజు గడవడం కోసం చిన్న ఉద్యోగంలో చేరారు. జాబ్ చేస్తుండగా నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తమ శబ్దాలయా బ్యానర్పై తొలిసారి డెయిలీ సీరియల్ తీస్తున్నారని తెలిసి కలిశారు. ఆ సీరియల్ డైరెక్టర్ డి.విజయ భాస్కర్ ఆయనకు కొత్త జీవితం ఇచ్చారు. ఆ సీరియల్ 'శ్రావణమేఘాలు' మంచి పేరు తెచ్చింది. తర్వాత అవకాశాలు శూన్యం. ఏడాది తర్వాత మరలా డి.విజయభాస్కరే 'తూర్పువెళ్ళే రైలు' సీరియల్కు స్వరకల్పన చేసే అవకాశం ఇచ్చారు.
ఇందులో పాటకు మంచి గుర్తింపు వచ్చింది.దీనికి 2008 'సినీగోయర్స్ అవార్డు' తీసుకున్నారు. 2011 నుంచి జీ టీవిలో వస్తున్న 'చిన్న కోడలు' సీరియల్ పాట' ఈ రాధాకృష్ణార్పణం'... ఎంతో పేరు తెచ్చింది. దీనికి జీటీవీ అవార్డు అందుకున్నా. ప్రస్తుతం సినీ నటి రమ్యకృష్ణ నటిస్తున్న 'అలా మొదలైంది' డెయిలీ సీరియల్కు స్వరకల్పన చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ తెలుగు అకాడమి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసింది.