వేదాంతము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'వేదాంతము' అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మమును తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంధముల చివరి భా గములు. వీటినే ఉపనిషత్తులు అని పిలుస్తారు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంధము నుండో గ్రహించినవి కావు. అవి స్వతస్సిద్ధములు, అపౌరుషేయములు. వ్రాయబడినవి కావు. వేదాంతమును 'ఉత్తర మీమాంస' అని కూడ చెప్పబడింది.
అనగ తరువాతి విచారణ లేదా అధికోన్నత విచారణ అని అర్ధం. ఈ నామం 'పూర్వ మీమాంస' యజ్ఞ, యాగాదులు, ఉపాసనలకు సంభందించిన మంత్రముల సముదాయము. (వేదాలలోని సంహిత భాగం).
 
పంక్తి 13:
ఇక రెండవది ఉత్తర భాగం. దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు. ఈవిద్య పర విద్య. వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిషత్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది వున్నాయి. ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యానములు వ్రాసి వున్నారు. అవే మనకు రక్ష అయి వున్నాయి. పరమాత్మ, సృష్టి కర్త అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసుకోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. ఆవే బ్రహ్మసూత్రములు. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.
 
ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. శ్రవణములు మాత్రమే. అందు వలననే వానిని అపౌరుషేయములని అన్నారు. అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు (ఉపనిషద్ భాగమునకు) రాగానే, గురువుగారు, మునుపటి భాగములో
చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య,(అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే) అనియు, పరమాత్మయే సత్యం అని భోధించుతారు. ఇక్కడ కర్మ ఖాండ పూర్తిగ నిషేదించ బడుతుంది. కర్మ ఖాండ నిషేదమునకు ఒప్పుకొ గల్గిన, శమ దమాదులు కలిగిన ఉత్తమ అధికారత్వము పొందిన వారికి మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది. శాస్త్రం వారిని "కశ్ఛిత్ ధీరాః" ఒకానొక ధీరుడు లేక
వివేకి మాత్రమే ఈ శాస్త్రార్ధం గ్రహించగలడు అని నిష్కర్షగ చెప్తుంది.
 
 
పంక్తి 21:
 
 
ఈ బాటలోనే శ్రీకృష్ణ పరమాత్మ, తన బాల్యములో, బ్రహ్మచర్యాశ్రమము ననుసరించి, సాంధీప మహాముని గురుకులములో తన సహపాటీలు కుఛేలుడు, అన్న బలరాముడు తో కలసి పర అపర విద్యలను అభ్యసించాడు. ఆ విద్యను, అర్జునునకు యుధ్దభూమిలో భగవద్గీతగా చెప్పినాడు. అందువలననే గీత ఉపనిషత్ సారాంశము అయినది. అందులో పర, అపర విద్యలు (అపర విద్య = కర్మఖాండ,పర విద్య = పరమాత్మ యొక్క యధార్థ ఉనికి) ధర్శనమిస్తయి. అంటే జీవన విధానము(ధర్మ,అర్ధ,కామ) + జీవన రహశ్యము (మోక్షము), ఈ రెండు తప్ప ఇతర విషయములకు తావు లేదు. ఇదే పూర్ణ విద్య.
 
ఈ రెండు విద్యలను, రాముల వారు తన బాల్యములో వశిష్టుల వారికి శిష్యుడయి, అభ్యసించి నాడు. అదే యోగవాశిష్టము అయినది.దానిని గీత అన్నను సరియే అగును. కనుక ఈ విద్య గురు శిష్య పరంపరగా ఈనాటికి సాగుతూ వస్తున్నది. ఇది మరుగు పడుట, ఏమైపోతుందో ననే భయము అక్కరలలేదు. రహస్యమేమిటి. ఇది ఆతని అనగా పరమాత్మ యొక్క ఉనికిని చాటే శాస్త్రము కనుక, తన శాస్త్రమునకు తానే రక్షకుడు. అలాగుననే ఈ జగత్తుకు తానే రక్షకుడు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతము" నుండి వెలికితీశారు