సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1144362 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
[[1871]] సంవత్సరంలో , [[జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] కు చెందిన డాక్టర్ కింగ్, [[ఖమ్మం జిల్లా]] లోని 'ఎల్లెందు' అనే గ్రామంలో [[బొగ్గు]] గనులను కనుగొన్నాడు. ఆంద్ర్హప్రదేశ్ఆంధ్ర్హప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా, గోదావరి జిల్లాల వారు, 'సర్ ఆర్ధర్ కాటన్' చేసిన సేవలను ఎలా మరిచిపోరో, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి గనుల వలన , ఈ జిలాల ప్రజలు డాక్టర్ కింగ్ ను కూడా మరిచి పోరు. ఇక్కడ దొరికే ప్రతి 'బొగ్గు' మీద 'డాక్టర్ కింగ్' పేరు ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. గోదావరి జిల్లాల వారు కూడా అక్కడ పండే ప్రతి బియ్యం గింజ మీద సర్ ఆర్ధర్ కాటన్ సంతకం ఉంటుంది అంటారు. 1886లొ, ఇంగ్లాండులో ఉన్న 'ది హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్', 'ఎల్లెండు' పరిసర ప్రాంతాలలో బొగ్గు గనులను తవ్వుకొనే హక్కు సంపాదించింది. 23 డిసెంబరు 1920 నాడు, 'హైదరాబాద్ కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్)' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థ గా అవతరించింది.
 
1 మే 2011 నాడు '''సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్''' (సింగరేణి కాలరీస్ సంస్థ) సమీక్ష. సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం, పవర్ ప్రాజెక్ట్‌లకు బొగ్గు సరఫరాల్లో కొరత రాబోతుంది.ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 51.3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించుకుని 36 భూగర్భ, 14 ఓపెన్‌కాస్టు గనుల ద్వారా అనేక అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని సంస్థ అధిగమించింది. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 2010-11లో టర్నోవర్ సుమారు 8,939 కోట్ల రూపాయలు కాగా 2009-10 ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 14శాతం ఎక్కువ. అన్ని పన్నుల చెల్లింపు తర్వాత సంస్థ అంచనా లాభాలు 320 కోట్ల రూపాయలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
|-
{| class="wikitable"
|-
! ఆర్ధిక సంవత్సరం !! మిలియన్ టన్నులు రవాణా
|-
| 2009-10 || 49.26
|-
| 2010-11 || 50.05
పంక్తి 13:
|}
 
* పవర్ సెక్టార్‌కు ఉత్పత్తిలో 72శాతం బొగ్గును రవాణా చేయడం విశేషం.
 
{| class="wikitable"
|-
! సంస్థ తో ఒప్పందం !!ఒప్పందం ప్రకారం చేయవలసిన బొగ్గు సరఫరా !! సరఫరా చేసిన బొగ్గు
|-
| ఎపి జెన్కోతో ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం ||113.40 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయవలసి ఉండగా || రికార్డు స్థాయిలో 151.95 లక్షల టన్నులు సరఫరా చేసింది. 134%
|-
| ఎన్‌టిపిసికి || తెలియదు || 133.88 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసింది. 131%
|-
|}
* అంతేకాకుండా సిమెంట్, హెవీవాటర్ ప్లాంట్, స్పాంజ్ ఐరన్ ఎన్‌ఎండిసి [[నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్]] యూనిట్లకు అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరా చేస్తోంది. అయితే తొలిసారిగా విద్యుత్ రంగంలోకి అడుగులు వేస్తూ ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలోని జైపూర్ వద్ద 5685 కోట్ల రూపాయలతో 1200 మెగావాట్ల సామర్థ్యంతో 600 మెగావాట్ల చొప్పున రెండు విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తూ 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించి శరవేగంగా పనులను కొనసాగిస్తోంది. ఈ విద్యుత్ ప్లాంట్లు ప్రారంభమైతే సంవత్సరానికి 500 లక్షల టన్నుల బొగ్గును వినియోగించాల్సిన పరిస్థితులు ఉండటంతో ఇప్పటివరకు సింగరేణి కాలరీస్ సంస్థ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు మినీ విద్యుత్ ప్లాంట్లకు ఉపయోగిస్తున్న బొగ్గు వినియోగంతోపాటు అదనంగా సంవత్సరానికి 500 లక్షల టన్నులు వినియోగించాల్సి వస్తోంది. అప్పటికి, సింగరేణిలో అదనంగా నూతన బొగ్గు ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాకపోతే, ఇప్పటివరకు పవర్ సెక్టార్‌తో పాటు ఇతర సెక్టార్లకు బొగ్గును సరఫరా చేసే సింగరేణి కాలరీస్ సంస్థ, ఇతర రంగాలకు, అవి ఆశించే స్థాయిలో బొగ్గును సరఫరా చేసే అవకాశాలు తక్కువ అవుతాయి.
 
* సింగరేణికి అనుబంధంగా ఉన్న అన్వేషణ విభాగం బొగ్గు నిల్వల నిర్ధారణ కోసం నిర్వహించే డ్రిల్లింగ్ పనులకు పలుచోట్ల ఆటంకాలు ఎదురవుతుండటంతో నూతన ప్రాజెక్ట్‌ల ఏర్పాటు సందేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ సింగరేణి సంస్థ బొగ్గును సొంత అవసరాలతో పాటు ఇతర రంగాలకు సరఫరా చేసేందుకు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నది.
 
* సింగరేణి కాలరీస్ సంస్థ ఇప్పటివరకూ (2009-10), గోదావరి లోయలో , బయటకు తీసిన బొగ్గు 929.12 మిలియన్ టన్నులు.