జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
గవిని వెంకట కృష్ణారావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించాడు. బక్కపలచటి శరీరం, ఆలొచనాత్మకమైన చూపులు, సునిశిత మేధ ఆయన లక్షణాలు. తురిమెళ్ళ, కొల్లూరు హైస్కూళ్లలో పాఠశాల విద్య అభ్యసించాడు. ఏసి కాలేజి,గుంటూరు నుండి 1937లో పట్టభద్రులై, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎం. ఏ. 1914లో పూర్తి చేశాడు. కాశీలో వుండగా మార్క్స్ సిద్ధాంతాల ప్రభావం ఆయనపై పడింది. మార్క్స్ సిద్ధాంతాల జాడలో కావ్య జగత్తు అనే సాహిత్య గ్రంథం వ్రాశాడు.
 
కాలక్రమేణా [[యంఎం.యన్ఎన్. రాయ్]] ఉద్యమ ప్రభావానికి లోనయ్యాడు. విగ్రహవ్యావర్తిని అనే తాత్విక సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. నాగార్జునాచార్యుని -న్యవాదాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తల సరళిని కృష్ణారావు ఆకళింపు చేసుకొన్నాడు. ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారికి తెలుగులోకి అనువదించాడు.
 
జేగంటలు, కీలుబొమ్మలు, వరూధిని శివరాత్రి, యుగసంధ్య ఈయన ఇతర రచలు. బొమ్మ ఏడ్చింది, భిక్షా పాత్ర వంటి నాటికలు ఆదర్శ శిఖరాలు అనే పేరుతో సంపుటిగా వెలువరించాడు. కీలుబొమ్మలు నవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. పాపికొండలు, రాగరేఖలు, జఘన సుందరి వీరి నవలల్లో ప్రసిద్ధాలు. గ్రామీణ జన జీవనాన్ని అద్దంపట్టే కథలు చైత్రరథం పేరుతో సంపుటిగా వేశాడు. ఉదబిందువులు యితర రచనల సంపుటి. నవ్యతోరణం వేదవ్యాస సంపుటి ప్రకటించాడు.
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు