గోపాల శతకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 64:
::: క్షణముల నెల్లడం సిరులజల్లెదు ఝల్లున రామరాట్ప్రభూ!
రామరాయ ప్రభువు ఐశ్వర్యవంతుడై పండితాదిపోషణ్ చేయుటకు కారణం కవి ఇట్లూహిస్తున్నాడు. విశాలమైన రాజావారి నేత్రాలను పద్మములనుకొని పద్మనిలయ యగు లక్ష్మీదేవి దానిలో నిలిచెను. కనుకనే రామరాయ ప్రభుని కటాక్షవీక్షణములు సిరులను వెదజల్లు చుండెను. ఈ పద్యములో భ్రాంతిమదాలంకారము, అతిశయోక్త్యలంకారము, అర్థాంతరన్యాసాలంకారములు ఉన్నాయి. కమనీయమైన ఈ కల్పన గర్భిత చంపకము చేయుట కవి ప్రతిభను చాటుచున్నది.
4. నాలుగవ భాగములోని 20 పద్యాలలో ప్రతిపాదపంచమాక్షరములను కలిపి చూస్తే తనను పోషింపమని రాజావారిని వేడుచు, ప్రభువుకు శ్రీరంగనాయకులు శుభములు కల్గించుగాక అని కవి ఆశీర్వదించిన భావము వస్తుంది.
5. ఐదవ భాగములో కవి తన పేరు నిక్షిప్తాక్షరాలలో తెలుపుతాడు.
6. శతకాంతములోని ఐదు పద్యాలలో గర్భితార్థము "దీనజనపోషకా మాన్యం దయచేసి పోషింపుమని కోరిక అని కలదు.
|