ఆవుల గోపాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
తొలగించిన పేరాలో AGKతో ఎవరికి సన్నిహిత సంబందం వుందో తెలియటం లేదు. అందువల్ల తొలిగించటమైనది.
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఆవుల గోపాలకృష్ణమూర్తి
| residence =
| other_names = ఎ జి కె
| image = Avula gopalakrishna murty.jpg
| imagesize = 200px
| caption = ఆవుల గోపాలకృష్ణమూర్తి
| birth_name = ఆవుల గోపాలకృష్ణమూర్తి
| birth_date = [[ఏప్రిల్ 29]], [[1917]]
| birth_place =
| native_place =
| death_date = [[సెప్టెంబరు 6]], [[1966]]
| death_place =
| death_cause =
| known = ప్రసిద్ధిచెందిన [[హేతువాది]]
| occupation =
| title =
పంక్తి 36:
}}
 
[[ఎ.జి.కె.]] గా ప్రసిద్ధిచెందిన [[హేతువాది]] '''ఆవుల గోపాలకృష్ణమూర్తి'''. వీరు [[ఏప్రిల్ 29]], [[1917]] న జన్మించారు. [[సూత పురాణం]] లోని పద్యాలన్నీ కంఠతా పట్టాడు. [[ఆవుల సాంబశివరావు]] పై ఈయన ప్రభావం ఉంది. [[రాడికల్ హ్యూమనిస్టు ]], [[సమీక్ష]] పత్రికలు నడిపారు. 1952 తెనాలి లో ఈయన జరిపిన హ్యూమనిస్టు సభకు [[ఎం.ఎన్.రాయ్]] ప్రారంభోపన్యాసాన్ని పంపారు. 1964లో అమెరికా ప్రభుత్వం ఈయన్ని ఆహ్వానించింది. [[వివేకానంద]] పై ఈయన చేసిన విమర్శల ధృష్ట్యా ఈయన్ని అమెరికా వెళ్ళనివ్వరాదని [[ఆంధ్రప్రభ]] ఆందోళన చేసింది.
 
సాహిత్యంలో ఔచిత్యం వుండాలనేది ఆవుల గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాధ సత్యనారాయణ మొదలు ప్రాచీన కవుల వరకూ తన విమర్శకు గురిచేశాడు. కవులు, రచయితలలో ఆవుల అంటే విపరీతాభిమానం గలవారు, తీవ్రంగా భయపడేవారు. రెండు వర్గాలుగా వుండేవారు. భయపడిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రధముడు. ఆవుల వుంటే ఆ సభ కు విశ్వనాథ వచ్చేవాడు కాదు. వేయి పడగలు మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ వుతికేసిన ఆవుల అంటే భయపడడం సహజం.
పంక్తి 45:
ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా ఎ.జి.కె. ఆంధ్రలో ప్రధాన పాత్ర వహించారు. సొంత ఖర్చులతో పత్రికలు, రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, నడిపారు. ఇంగ్లీషు పత్రికలకు రాశారు. మానవవాద, హేతువాద ఉద్యమాలు తీవ్రస్థాయిలో నడిపించారు.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి నోట్లో అతి సామాన్యమైన పలుకు కూడా మాధుర్యం సంతరించుకుంటుందని మూల్పూరుకు చెందిన (ఎ.జి.కె. గ్రామం) వెనిగళ్ళ వెంకట సుబ్బయ్య అనేవారు.
 
1955 నుండీ ఎజికెతో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. గుంటూరు ఎ.సి. కాలేజీలో చదువుతూ ఆయన ఉపన్యాసాలు ఏర్పరచాము. సాహిత్యంలో ఔచిత్యం అనే ఉపన్యాసం యివ్వగా, స్ఫూర్తి శ్రీ (బాస్కరరావు లెక్చరర్) రాసి, ఆంధ్ర పత్రికలో ప్రచురించారు. అది వాదోపవాదాలకు దారి తీసింది. అందులో నన్నయ్య ఆది పర్వం నుంచి అనేక మంది కవుల అనౌచిత్యాలను ఎజికె. విమర్శించారు.
పెళ్ళి ఉపన్యాసాలు కూడా ఎ.జి.కె. అద్భుతంగా చేసేవారు. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో అందరికీ అర్ధమయ్యేటట్లు ప్రమాణాలు చేయించి, వివరణోపన్యాసం చేసేవారు. అలాంటివి నేను ఎన్నో విన్నాను.
నా వివాహం 1964లో ఆయనే తెనాలిలో చేయించారు. ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు.
 
ఎ.జి.కె. పెళ్ళి ఉపన్యాసాలంటే అదొక సాహిత్య వ్యాసం అనవచ్చు. ప్రతి చోట ప్రత్యేక పాయింట్లు చెప్పేవారు.