'''ముంబయి''' ([[మరాఠీ]]: '{{lang-mr|मुंबई}}) , పూర్వము దీనిని '''బొంబాయి''' అని పిలిచేవారు. ఇది [[భారత దేశం]]లోని ఒక ప్రముఖ [[నగరము]]. ఇది [[మహారాష్ట్ర]] రాష్ట్రము యొక్క రాజధాని మరియు ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహరాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉన్నది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈనగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్తులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈనగర వాసుల సాహసము ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియా లొ ముంబాయ్ అతి పెద్ద నగరము.