డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''డి.కామేశ్వరి''' కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. [[న్యాయం కావాలి]], [[కోరికలే గుర్రాలైతే]] సినిమాలుగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]], [[ఆగష్టు 22]]వ తేదీన [[కాకినాడ]]లో జన్మించింది. [[తూర్పుగోదావరి జిల్లా]] [[రామచంద్రాపురం]]లో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్లి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
 
==రచనలు==
1962లో ఆంధ్రపత్రికలో 'వనితలు వస్త్రాలు' అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు - ఆకాకరకాయలు అనే కథ ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. ఈమె కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళభాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.
===నవలలు===
# కొత్తనీరు
"https://te.wikipedia.org/wiki/డి._కామేశ్వరి" నుండి వెలికితీశారు