దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
పదకొండు సంవత్సరాల వయసులోనే కవితావ్యాసంగం ప్రారంభించాడు.
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అనకాపల్లి వాస్తవ్యులు రేపాక సత్యనారాయణ రచించిన గ్రంధం ఆధారంగా ఈయన “కన్యకాపురణ పరిశీలన” అనే సిద్ధాంత గ్రంధం రాసి “ఎం.ఫిల్” పట్టాని పొందాడు. ఇతని ఉద్యోగపర్వం 1916 వ సంవత్సరంలో ప్రారంభమైంది. కంచి పచ్చయప్ప ఉన్నత పాఠశాలలో, మద్రాసు క్రైస్తవ కళాశాలలో, పెరంబూరులోని కళాశాల, విజయవాడలో యస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాల మొదలగు చోట్ల తెలుగు పండితుడిగా, ఆంధ్రోపన్యాసకునిగా పని చేసాడు. 1933 లో విద్వాన్ పట్టాని పొందినాడు. గుప్త 2-2-1938లో [[మహాత్మా గాంధీ]]ని కలసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన కళను గురించి వినిపించగా అది విన్న మహాత్ముడు, ఆశ్చర్యపడి అవధాన విద్యను అభ్యసించేందుకు శారదోపాసన అవసరమౌతుందని అభిప్రాయ పడ్డాడు.
సాహితీ ప్రముఖులుగా ప్రశస్తిగన్న [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చిలుకూరి నారాయణరావు]], [[శ్రీపాద కృష్ణముర్తికృష్ణమూర్తి శాస్త్రి]] మొదలైనవారు ఇతని అవధానసభల్లో అగ్రాసనాధిపులు గానో పరీక్షకులు గానో ఉండి సభలను రంజిపజేసినారు.
[[తిరుపతి వేంకటకవులు]] గుప్త యొక్క విద్యగురువులు. గుప్త చేసే ప్రతి అవధానంలో ప్రారంభంలో ఈ కవుల గురించి ఏదో ఒక పద్యము చెప్పి గురుస్తుతి చేసేవాడు.
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,౦౦౦ పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.