బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 44:
విశే: స్వయం వ్యక్తక్షేత్రము. తిరు అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలము. విశాలపురి యనియు తిరునామము గలదు. ఇచట స్వామి అగ్నితప్త కుండముగా వేంచేసియున్నారు. ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరించవలెను. ఇచట పెరుమాళ్లు మాత్రమే దృవమూర్తిగా వేంచేసియున్నారు. మిగతావారు ఉత్సవమూర్తులు. ఈస్వామి ఎదుట తెరవేయరు. తిరుమంజనాదులన్నియు బహిరంగముగనే జరుగును. మంచు పడుట వలన తులమాసం పౌర్ణమినాడు(వెణ్ణకాప్పు) వెన్న సమర్పించి తలుపులు వేయుదురు. తిరిగి మేష మాసం పౌర్ణమినాడు తలుపులు తీయుదురు. సన్నిధికి వెనుకగల లక్ష్మీనృసింహ మందిరమున ఉడయవర్ వేదాంత దేశికులు మొదలగువారు వేంచేసియున్నారు. ఈ క్షేత్రమున మన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారిచే నిర్మింపబడిన సన్నిధి గలదు. ఇచటకు 1 కి.మీ దూరములో బ్రహ్మకపాలము గలదు. ఇచటకు 8 కి.మీ. దూరమున గల వసుదార కలదు. ఇందు జలము పుణ్యులైన వారిమీదనే పడునని ప్రతీతి.
=== మార్గం ===
మార్గము: హరిద్వార్(కలకత్తా-డెహ్రాడూన్ మార్గం)నుండి హృషికేశ్ చేరి అట నుండి 300 కి.మీ. బస్లో ప్రయాణించి బదరీచేరవలెను.
== సాహిత్యం ==
<poem>
|