వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
గుంటూరు జిల్లా [[చెరుకుపల్లి]] మండలం లోని [[నడింపల్లి]] గ్రామానికి చెందిన శ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీదాకారుడు. వీరి సతీమణి శ్రీదేవి బి.ఇ.డి. చేసినారు. ఈ దంపతులు తమ కుమార్తె అయిన వెన్నం జ్యోతి సురేఖ భవిష్యత్తు కోసం, వియయవాడలో స్థిరపడినారు. చిన్నప్పటినుండి తమ చిన్నారికి ఈతలో శిక్షణ ఇప్పించినారు. జ్యోతి తన నాలుగు సంవత్సరాల వయసులోనే తన ఈత విన్యాసాలతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నది. 5 కి.మీ. దూరంలో కృష్ణానదిని మూడు గంటల ఇరవై నిమిషాల ఎనిమిది సెకండ్లలో ఈది, "పిట్ట కొంచెం కూత ఘనం" అనిపించుకున్నది. తరువాత ఈమె విలువిద్యపై గురిపెట్టినది. కొద్దికాలంలోనే ఆ క్రీడపై తనదైన ముద్రవేసినది. 13 సంవత్సరాల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన జ్యోతి, ఇక వెనుదిరిగి చూడలేదు. 2009 లో టైజునా లో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం గెల్చుకున్నది. అదే వేదికపై మరో మూడు రజత పతకాలనూ మరియూ ఒక కాంస్య పతకాన్నీ గూడా స్వంతం చేసుకుని తన ప్రతిభ ప్రదర్శించినది. 2011 లో టెహరానులో జరిగిన ఆసియా ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో మహిళా కాంపౌండ్ టీం సభ్యురాలిగా కాంస్య పతకం గెల్చుకున్నది. 2013 లో చైనాలోని "వుక్సి" వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్ మరియూ కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించినది. తాజాగా ఈమె 2014 సెప్టెంబరులో, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుచున్న ఆసియా క్రీడలలో భారత ఆర్చెరీ మహిళా జట్టు సభ్యురాలిగా కాంస్య పతకం స్వంతం చేసుకున్నది.
 
ఈమె 2015,మే-21 నుండి 24 వరకు, పాటియాలాలో, పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొని, ప్రథమ స్థానం సంపాదించినది. ముగ్గురు సభ్యుల బృందంలో ప్రథమ స్థానం సంపాదించి, ఈమె, ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్యా పోటీలకు ఎంపికై, దక్షిణ కొరియా దేశంలోని గ్యాంగ్ జూ నగరంలో నిర్వహించిన ప్రపంచ విశ్వవిద్యాలయల విలువిద్య ఫోటీలలో పాల్గొన్నది. గ్యాంగ్ జూ క్రీడా గ్రామంలో నిర్వహించిన వరల్డ్ యూనివర్సైడ్ గేంస్-2015 ప్రారంభ వేడుకలలో ఈమె భారత జట్టుకి నాయకత్వం వహించి, గౌరవ వందనం చేసినది. ఈ అరుదైన గౌరవం దక్కిన తొలి రాష్ట్ర క్రీడాకారిణి ఈమె. గ్యాంగ్ జూ క్రీడాగ్రామంలో జరిగిన ఈ వేడుకలలో 33 దేశాలకు చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. 2015,జులై-4 నుండి 8 వరకు నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొన్న సురేఖ, మహిళా కాంపౌండ్ విలువిద్య పోటీలలో, వ్యక్తిగత ఒలింపిక్ పోటీలలో 5వ స్థానం, మిక్సెడ్ విభాగంలో రజతపతకం, జట్టు విభాగంలో 7వ స్థానంలో నిలిచినది. ర్యాంకిగ్స్ లో, 720 పాయింట్లకు గాను 682 పాయింట్స్ సాధించి 8వ స్థానంలో నిలిచినది. [1]&[3]
 
ఈమె డెన్మార్క్ దేశంలో 2015,జులై-26 నుండి ఆగష్టు-2 వరకు నిర్వహించిన ప్రపంచ విలువిద్యా పోటీలలో పాల్గొంటుంది. ఈమె 2015,జులై-4 నుండి 15 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య జట్టుకు ప్రాతినిధ్యం వహించినది. ఈ పోటీలలో ఈమె ఫైనల్సుకు చేరుకున్నది. [2]