కొత్త భావయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
'''కొత్త భావయ్య చౌదరి''' ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, [[గుంటూరు]] మండలము, [[తెనాలి]] సమీపమున నున్న [[సంగం జాగర్లమూడి]] అను గ్రామములో [[జూన్ 2]], [[1897]]లో జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై [[శ్రీ కందుకూరి వీరేశలింగం]] పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. స్వగ్రామమైన సంగం జాగర్లమూడి సర్పంచ్ గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు.
 
ఆంధ్ర, కర్ణాట, తమిళ దేశములందు దొరికిన శాసనములు, సంస్కృతాంధ్ర కావ్యములు, తాళపత్ర గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి , ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరములు కృషి చేసి [[కమ్మ]]వారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు<ref>కమ్మవారి చరిత్రము, కొత్త భావయ్య చౌదరి, 1939 </ref>. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడినది.<ref>A Brief History of the Kammas, Kotta Bhavaiah Choudary, Published by K. Bhavaiah Choudary, 1954, Sangam Jagarlamudi, Andhra Pradesh</ref>.
 
మద్రాసులో[[మద్రాసు]]లో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను మున్నగు వారిని సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.
 
భావయ్య విరచితమైన పెక్కు పుస్తకములలో కొన్ని: దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, [[ఆంధ్ర రాజులు]], [[గుంటూరు]] మండల ప్రాచీన చరిత్ర, శాయపనేనివారి చరిత్ర, పరశురామ నాటకము, వినోద కథలు, ప్రభోధకుసుమావళి.
 
భావయ్య 1973లో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/కొత్త_భావయ్య" నుండి వెలికితీశారు