చుండూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
===శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం===
చుండూరు-కె.ఎన్.పల్లి గ్రామాల మధ్య "శ్రీ బాలకోటేశ్వరస్వామి" వారి ఆలయం ఉన్నది. నార్కేట్ పల్లికి చెందిన శ్రీ అక్కి బాపయ్య, పొలంలో త్రవాకాలు జరుపుచుండగా, ఒక శివలింగం బయట పడింది. 1938లో తాటాకు పందిళ్ళలో శివలింగం ఏర్పాటు చేసి, భక్తులు పూజలు చేశారు. నాలుగేళ్ళపాటు అవే తాటాకు పందిళ్ళలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తరువాత చుండూరుకు చెందిన శ్రీ గాదె నాగభూషణరెడ్డి, గ్రామస్తుల సహకారంతో ఆలయం నిర్మించారు. అప్పటినుండి స్వామివారికి నిత్య నైవేద్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుచున్నారు. అంచెలంచెలుగా దేవాలయ అభివృద్ధికి పలువురు విరాళాలిచ్చారు. రెండేళ్ళక్రితం దేవాలయ ప్రాంగణంలో మంటప నిర్మాణం, నవగ్రహాల ఏర్పాటుకు, వలివేరుకు చెందిన భక్తులు శ్రీ టి.వీరారెడ్డి బుల్లెయ్య, రు. 2 లక్షలు విరాళం అందజేశారు. గత ఏడాది చుండూరుకు చెందిన శ్రీ జి.రామిరెడ్డి, ఒకటిన్నర లక్షల రూపాయలతో కళ్యాణమంటపం నిర్మించారు. ఆలయంలో పొంగళ్ళు వండుకోవడానికి ఒక షెడ్డు ఏర్పాటుచేశారు. క్యూలైనులకోసం బ్యారికేడులు ఏర్పాటుచేశారు. [4]
===శ్రీ రామమందిరం===
ఈ మందిరం చుండూరు గ్రామములోని దక్షిణ బజారులో ఉన్నది.
===భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి 13వ ఆరాధనోత్సవాలు, 2015,నవంబరు-15వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అద్జికసంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారధన నిర్వహించినారు. [9]
"https://te.wikipedia.org/wiki/చుండూరు" నుండి వెలికితీశారు