కొత్తపల్లి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''కొత్తపల్లి వీరభద్రరావు''' 5 దశాబ్దాలపాటు పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు. ఇతడు [[రాజమండ్రి]]లో కొత్తపల్లి వెంకటరత్న శర్మ, రామమ్మ దంపతులకు జన్మించాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు 1942లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి తెలుగులో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అదే విశ్వవిద్యాలయం నుండి 1956లో '''తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము''' అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా సాధించాడు. ఇతడికి తెలుగు భాషతో పాటుగా సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, పంజాబీ, రష్యన్ మరియు ఫ్రెంచి భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు విజయనగరం లోని మహారాజా కళాశాలలో ప్రాచ్యభాషావిభాగానికి అధిపతిగా పనిచేశాడు. తర్వాత తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ యూనివర్సిటీ (మాడిసన్, అమెరికా) లలో పనిచేశాడు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. మలేషియాలో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యారు.
 
==పదవులు==